IND vs ENG: ఘోర ఓటమి.. మా జట్టుకు నిజాయతీ అవసరం: ఇంగ్లాండ్పై మాజీ కెప్టెన్ తీవ్ర వ్యాఖ్యలు
ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ 1-4 తేడాతో (IND vs ENG) ఘోర ఓటమిని చవిచూసింది. భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి మరీ సిరీస్ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ చేతిలో 1-4 తేడాతో ఇంగ్లాండ్ (IND vs ENG) ఓడిపోవడంపై ఆ జట్టు మాజీ క్రికెటర్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. మాజీ క్రికెటర్ అలిస్టర్ కుక్ తన టీమ్ను వెనుకేసుకొని రాగా.. మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ మాత్రం విమర్శలు గుప్పించాడు. ఈ ఘోర ఓటమిపై నిజాయతీగా సమీక్షించుకోవాలని.. ఆటగాళ్లలో కొందరు జట్టు కొత్త సంప్రదాయానికి అలవాటుపడలేదని వ్యాఖ్యానించాడు. ఐదో టెస్టులో మరీ ఘోరంగా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని తెలిపాడు.
‘‘భారత పర్యటనలో ఎదురైన ఘోర పరాభవంపై ఇంగ్లాండ్ జట్టు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదీనూ నిజాయతీగా ఎక్కడ తప్పులు చేశామనేది సమీక్షించుకోవాలి. అలానే చేస్తుందని భావిస్తున్నా. ప్రతి అంశంపైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ఇదే విధంగా కాకుండా.. ఇంకాస్త ఉత్తమంగా ఆటను కొనసాగిస్తే మంచిది. వారు ఇప్పుడు ప్రయత్నిస్తున్న ఫార్మాలాను (బజ్బాల్ క్రికెట్) నేను గౌరవిస్తా. ప్రతి రోజూ మ్యాచ్ను చూసేలా చేయగలిగారు. ప్రపంచంలో ఎలాంటి జట్టునైనా ఓడించగల సత్తా ఉన్న ఇంగ్లాండ్కు పెద్ద సిరీసుల్లో పరాజయం కావడం తీవ్ర నిరుత్సాహానికి గురి చేసే అంశం. మరీ ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో ఘోర వైఫల్యం కనిపిస్తోంది. ఇంకా కొందరు ఆటగాళ్లు జట్టు కొత్త సంప్రదాయానికి అలవాటు పడలేకపోయారు. ఉల్లాసంగా ఉంటూనే కష్టపడే జట్టుగా అందరూ భావిస్తున్నారు. కానీ, డ్రెస్సింగ్ రూమ్లో అలాంటి పరిస్థితి లేదనిపిస్తోంది. అందుకే, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.
ప్రతిసారీ జట్టు సభ్యులను వెనుకేసుకు రావడం సరైన పద్ధతి కాదు. కాస్త కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బయట నుంచి చూడటానికి బాగుందనిపిస్తుంది. సానుకూలత ప్రదర్శించడం మంచిదే. కానీ, జట్టు విజయాలపై ప్రభావం పడితే ఒక్కోసారి అదే కష్టంగా మారుతుంది. అందుకే, కొన్నిసార్లు నిజాయతీ కూడా అవసరం. జట్టుకు పంపే సందేశంపై ఎవరూ అనుమానం పడరు. ఎక్కడ తప్పు జరిగింది? ఎలా దానిని సరిదిద్దుకోవాలనే అంశాలపై దృష్టిసారించాలి. సహచరులు, కోచింగ్ సిబ్బంది చర్చించుకుంటే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చెడిపోదు. ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ కూడా ఆటగాళ్లకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చింది. అబుదాబిలో ప్రాక్టీస్ సెషన్స్ ఏర్పాటు చేసింది. బెంగళూరులో గోల్ఫ్ను ఆటవిడుపుగా ఆడారు. నేనేమీ పాతకాలంలా టెస్టు సిరీస్కు ముందు మూడు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాలని చెప్పను. అదంతా గతం. అవసరం లేదు కూడానూ. అయితే, సుదీర్ఘమైన బ్రేక్లు వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా మ్యాచ్లు నిర్వహిస్తే బాగుండేది. తుది జట్టుపై ఓ అంచనా రావడానికి అవెంతో కీలకంగా మారతాయి’’ అని మైకెల్ వాన్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్