MS Dhoni: కోర్టులో ఎంఎస్ ధోనీ ఫిర్యాదు.. మాజీ బిజినెస్ పార్టనర్ అరెస్ట్
ఎంఎస్ ధోనీని మోసం చేసిన కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. రాంచీ కోర్టులో అతడు చేసిన ఫిర్యాదుపై స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: ధోనీ మాజీ బిజినెస్ పార్టనర్ మిహిర్ దివాకర్ను జైపుర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా తన పేరును క్రికెట్ అకాడమీల కోసం వాడుకొన్నారని రాంచీ జిల్లా కోర్టులో మూడు నెలల కిందటే దివాకర్తోపాటు సౌమ్యా దాస్పై ధోనీ ఫిర్యాదు చేశాడు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు జైపుర్లో దివాకర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో అతడు డైరెక్టర్గా ఉన్నారు. సౌమ్యా దాస్ ఆచూకీ ఇంకా తెలియదు.
అసలేం జరిగిందంటే?
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేయడానికి ధోనీతో దివాకర్కు చెందిన ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ 2017లో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఆర్కా స్పోర్ట్స్.. ఫ్రాంఛైజీ ఫీజులు, లాభాల్లో వాటాను క్రికెటర్కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఒప్పందంలోని షరతులను పాటించడంలో అతడి కంపెనీ విఫలమైంది. దీనిపై ఆర్కా స్పోర్ట్స్కు చెందిన మిహిర్ దివాకర్, సౌమ్య దాస్తో చర్చించినా ఫలితం లేకపోవడంతో.. ఆ ఒప్పందం నుంచి ధోనీ వైదొలిగాడు. 2021 ఆగస్టు 15న ఆర్కా స్పోర్ట్స్కు ఇచ్చిన అథారిటీ లెటర్ను కూడా రద్దు చేసుకున్నాడు. అనంతరం పలుమార్లు లీగల్ నోటీసులు పంపించారు. అయినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోనీ కోర్టును ఆశ్రయించాడు. మిహిర్ దివాకర్, సౌమ్యపై రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆర్కా స్పోర్ట్స్ చేసిన మోసం కారణంగా ధోనీకి రూ.15కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. దీంతో వారిద్దరిపై క్రిమినల్ కేసు నమోదైంది. ధోనీ క్రికెట్ అకాడమీ పేరుతో ఆర్కా స్పోర్ట్స్ దేశంలో పలు చోట్ల అకాడమీలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..