Sunil Gavaskar: ధోనీ కాదు.. ‘అతడే అసలైన కెప్టెన్ కూల్’: సునీల్ గావస్కర్
సాధారణంగా భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni)ని అభిమానులు ‘కెప్టెన్ కూల్’ అని పిలుస్తారు. అయితే, టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ మరో ఆటగాడిని ‘ఒరిజినల్ (అసలైన) కెప్టెన్ కూల్’ అని సంబోధించాడు.
ఇంటర్నెట్ డెస్క్: మైదానంలో ఎంత ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా ఉంటూ జట్టును ముందుండి నడిపించే వాడు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni). బౌలర్లు భారీగా పరుగులిచ్చినా అతడు కోప్పడిన సందర్భాలు చాలా అరుదు. అందుకే అభిమానులు, క్రీడా పండితులు అతడిని ‘కెప్టెన్ కూల్’ అని పిలుస్తుంటారు. అయితే, టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) మరో ఆటగాడిని ‘ఒరిజినల్ (అసలైన) కెప్టెన్ కూల్’ అని సంబోధించాడు. ఇంతకీ ఆ ఆటగాడేవరో కాదు టీమ్ఇండియాకు మొట్టమొదటిసారి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev). 1983 ప్రపంచకప్లో అండర్డాగ్స్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా (Team India) కపిల్ సారథ్యంలో ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ ప్రపంచకప్లో కపిల్దేవ్ కెప్టెన్గా రాణించడంతోపాటు ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
‘‘1983 ప్రపంచకప్లో కపిల్దేవ్ బ్యాటింగ్లో రాణించడంతోపాటు బంతితోనూ అదరగొట్టాడు. ఫైనల్లో (వెస్టిండీస్తో) అతడు వివి రిచర్డ్స్ క్యాచ్ను అందుకున్న సంగతిని మర్చిపోకూడదు. ఫార్మాట్కు అవసరమైన విధంగా కపిల్దేవ్ కెప్టెన్సీ డైనమిక్గా ఉండేది. ఎవరైన క్యాచ్ను వదిలేసినా లేదా మిస్ ఫీల్డ్ చేసినా కోప్పడకుండా చిరునవ్వుతో ఉండేవాడు. ఈ విధానమే అతడిని ‘ఒరిజినల్ (అసలైన) కెప్టెన్ కూల్’గా చేసింది’’ అని సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు. ప్రపంచకప్ ఫైనల్లో మంచి ఊపుమీదున్న వివి రిచర్డ్స్ (33; 28 బంతుల్లో 7 ఫోర్లు) మదన్లాల్ బౌలింగ్లో కపిల్దేవ్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ చేరాడు.
కపిల్ డెవిల్స్.. దేశానికి మొట్టమొదటి క్రికెట్ ప్రపంచకప్ను అందించి సరిగ్గా 40 ఏళ్లవుతోంది. 1983 జూన్ 25న ఫైనల్లో బలమైన విండీస్ను ఓడించి టీమ్ఇండియా తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. 28 ఏళ్ల తర్వాత మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో 2011లో భారత్ రెండోసారి ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోనీ సిక్సర్ బాది టీమ్ఇండియాకు విజయాన్ని అందించిన క్షణాలు అభిమానుల కళ్లముందు ఇప్పటికీ కదలాడుతుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
ఎవరా 15..!
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం