Worldcup 2023: ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్కు మోదీ..
ODI Worldcup 2023: ప్రపంచకప్ ఫైనల్లో ఓటమితో నిరాశలో ఉన్న టీమ్ఇండియా ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు ప్రధాని మోదీ (PM Modi) నిన్న డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లారు. వారికి మద్దతుగా నిలిచారు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ టోర్నీ (ODI Worldcup 2023)లో అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ (Final)కు చేరిన టీమ్ఇండియా (Team India).. చివరి పరీక్షలో విఫలమవడంతో మెగా కప్పు కల చెదిరిపోయింది. గతరాత్రి ఫైనల్ మ్యాచ్ (IND vs AUS)లో ఓటమి.. భారత ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేక టీమ్ఇండియా ఆటగాళ్లు మైదానంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి క్షణాల్లో నిరాశలో కూరుకుపోయిన మన జట్టుకు భరోసానిచ్చి, ఉత్సాహపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లారు. ఆటగాళ్లను ఓదార్చారు.
ఈ విషయాన్ని ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సోషల్మీడియాలో వెల్లడిస్తూ.. ప్రధానితో ఉన్న ఫొటోను పంచుకున్నాడు. ‘‘ఈ గొప్ప టోర్నమెంట్లో అద్భుతంగా రాణించినప్పటికీ.. మేం నిరాశతో ముగించాం. నిన్నటి ఫలితంతో మా గుండె బద్దలైంది. కానీ, మీ మద్దతుతోనే మేం ముందుకు సాగగలుగుతున్నాం. ప్రధాని మోదీ నిన్న మా డ్రెస్సింగ్ రూమ్కు రావడం చాలా ప్రత్యేకంగా అన్పించింది. ఎంతో ప్రేరణనిచ్చింది’’ అని జడ్డూ రాసుకొచ్చాడు. అటు షమీ కూడా మరో ఫొటోను షేర్ చేస్తూ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు. మళ్లీ బలంగా తిరిగొస్తామని పేర్కొన్నాడు.
మైదానంలో నిశ్శబ్దానికి కారణాలెన్నో..!
అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ను ప్రధాని మోదీ వీక్షించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్తో కలిసి ప్రధాని ఈ మ్యాచ్ను వీక్షించారు. అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లకు షేక్హ్యాండ్ ఇస్తూ అభినందించారు. ఆస్ట్రేలియా సారథి కమిన్స్కు వీరిద్దరూ ట్రోఫీని అందజేశారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ సేనకు మద్దతు పలుకుతూ ప్రధాని మోదీ ఓ ట్వీట్ చేశారు. ‘‘డియర్ టీమ్ఇండియా, ఈ ప్రపంచ కప్లో మీ ప్రతిభ, సంకల్పం గుర్తుంచుకోదగినది. గొప్ప స్ఫూర్తితో ఆడి.. దేశానికి గర్వకారణంగా నిలిచారు. మేమంతా ఈరోజు, ఎప్పటికీ మీ వెంటే ఉంటాం’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
వరల్డ్ కప్ జట్టులో కొందరు యువ క్రికెటర్లకు అవకాశం రాలేదు. అనుకోకుండా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ జట్టులోకి వచ్చాడు. అతడి ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. -
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ