PV Sindhu: సింగపూర్‌ ఓపెన్‌లో సెమీస్‌కు చేరిన పీవీ సింధు

భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు శుక్రవారం సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరింది. క్వార్టర్‌ ఫైనల్లో ఆమె ఛైనాకు చెందిన హాన్‌ యూతో తలపడిన సందర్భంగా...

Updated : 15 Jul 2022 19:14 IST

సింగపూర్‌: భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు శుక్రవారం సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరింది. క్వార్టర్‌ ఫైనల్లో ఆమె చైనాకు చెందిన హాన్‌ యూతో తలపడిన సందర్భంగా 17-21, 21-11, 21-19 తేడాతో విజయం సాధించింది. తొలి గేమ్‌లో వెనుకపడిపోయిన సింధు తర్వాత రెండు, మూడు గేమ్స్‌లో పుంజుకొని చైనా క్రీడాకారిణిపై ఆధిపత్యం చెలాయించింది. ఈ క్రమంలోనే చివరి రెండు గేమ్స్‌లో పైచేయి సాధించి సెమీస్‌లో బెర్త్‌ ఖరారు చేసుకుంది. దీంతో హాన్‌యూతో హెడ్‌ టు హెడ్‌ తలపడిన మ్యాచ్‌ల్లో సింధు ఇప్పుడు 3-0 ఆధిక్యంలో నిలిచింది.

మరోవైపు మే నెలలో ఓపెన్‌ థాయ్‌లాండ్‌లో సెమీస్‌ చేరిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు సింగపూర్‌ ఓపెన్‌లోనే సింధు సెమీస్‌కు చేరడం గమనార్హం. అయితే, తర్వలో జరగబోయే కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు ముందు ఇదే ఆమెకు చివరి టోర్నీ కావడంతో ఎలాగైనా టైటిల్‌ సాధించాలనే కసితో ఉంది. ఇక తర్వాతి మ్యాచ్‌లో జపాన్‌ షట్లర్‌, అన్‌సీడెడ్‌ ప్లేయర్‌ సేనా కవాకమితో తలపడనుంది. అయితే, ఆమె క్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ఆరో సీడ్‌ పార్న్‌పావే చోచువాంగ్‌పై 21-17, 21-19ని వరుస గేమ్స్‌లో ఓడించడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని