WPL: పోరాడిన యూపీ.. 23 పరుగుల తేడాతో బెంగళూరు విజయం

యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Updated : 04 Mar 2024 23:08 IST

బెంగళూరు: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)లో యూపీ వారియర్స్‌ (UP Warriorz)కు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) షాక్‌ ఇచ్చింది. హ్యాట్రిక్‌పై కన్నేసిన ఆ జట్టును 23 పరుగుల తేడాతో ఓడించింది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన యూపీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 175 పరుగులు చేసింది. ఓపెనర్‌ అలీసా హేలీ (55: 38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), దీప్తి శర్మ (33), పూనమ్‌ (31) చెలరేగినప్పటికీ మిగతావారు విఫలం కావడంతో ఆ జట్టు పోరాడి ఓడిపోయింది. ఆర్సీబీ జట్టులో షోపీ డివైన్‌, ఆషా శోభనా, షోపీ మోలినెక్స్‌, జార్జియా వేర్‌హమ్‌ తలో రెండు వికెట్లు తీశారు. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు దంచికొట్టింది. కెప్టెన్‌ స్మృతి మంధాన (80), ఎలీస్‌ పెర్రీ (58) చెలరేగడంతో ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఓపెనర్లు సబ్బినేని మేఘన (28), మంధాన తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించారు. మేఘన ఔట్‌ అయిన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ఎలీస్‌ పెర్రీతో కలిసి మంధాన దూకుడుగా ఆడింది. యూపీ బౌలర్లలో అంజలి, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని