PBKS vs RCB: అదరగొట్టిన సిరాజ్.. బెంగళూరుదే విజయం
ఐపీఎల్-16 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్కు మూడో విజయం. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.
మొహాలి: ఐపీఎల్-16 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్కు మూడో విజయం. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు ఆదిలో తైడే (4) వికెట్ను కోల్పోయింది. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (46; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు), వికెట్ల మధ్య పరుగులు రాబడుతున్నా, ఇంకో ఎండ్ నుంచి అతనికి సహకారం అందలేదు. మరోవైపు బ్యాట్స్మెన్పై బెంగళూరు బౌలర్లు ఒత్తిడి తేవడంతో మాథ్యూ షార్ట్ (8), లివింగ్స్టోన్ (2), హర్ప్రీత్ సింగ్ భాటియా (13), సామ్ కరన్ (10) వికెట్లు కోల్పోయింది. ప్రభ్సిమ్రన్ వికెట్ పడిన తర్వాత, మ్యాచ్ను ముందుకు నడిపే బాధ్యత జితేశ్ శర్మ (41; 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) తీసుకున్నాడు. ఒకానొక దశలో పంజాబ్ను విజయం వైపు నడిపేటట్లు కనిపించాడు. సిరాజ్ తన బౌలింగ్ మాయాజాలంతో వరుస వికెట్లు తీయడంతో విజయం బెంగళూరును వరించింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు, హసరంగ రెండు.. పార్నెల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (59; 47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), డు ప్లెసిస్ (84; 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ శతకాలతో మెరిశారు. మ్యాక్స్వెల్ (0) డకౌటయ్యాడు. దినేశ్ కార్తిక్ (7) కూడా విఫలమయ్యాడు. మహిపాల్ లోమ్రోర్ (7*), షాబాజ్ అహ్మద్ (5*) నాటౌట్గా నిలిచారు. కోహ్లీ, డు ప్లెసిస్ తొలుత దూకుడుగా ఆడటంతో 11 ఓవర్లకు 98/0తో నిలిచింది. దీంతో ఆర్సీబీ స్కోరు 200 దాటేలా కనిపించింది. అయితే, తర్వాత పంజాబ్ బౌలర్లు పుంజుకోవడంతో స్కోరు వేగం తగ్గింది. తొలి వికెట్కు కోహ్లీ, డు ప్లెసిస్ ద్వయం 137 పరుగులు జోడించారు. హర్ప్రీత్ బ్రార్ వేసిన 17 ఓవర్లో మొదటి బంతికి విరాట్ కోహ్లీ (59), తర్వాతి బంతికే మ్యాక్స్వెల్ (0) డకౌటయ్యాడు. కోహ్లీ.. వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇవ్వగా.. మ్యాక్స్వెల్ అథర్వ తైడేకు చిక్కాడు. నాథన్ ఎల్లిస్ వేసిన 18 ఓవర్లో డు ప్లెసిస్ లాంగాఫ్లో సామ్ కరన్కు చిక్కాడు. అర్ష్దీప్ సింగ్ వేసిన 19 ఓవర్లో దినేశ్ కార్తిక్ అథర్వ తైడేకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆర్సీబీ అనుకున్న దానికన్నా తక్కువ స్కోరుకే ఇన్నింగ్స్ను ముగించింది. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 2, నాథన్ ఎల్లిస్, అర్ష్దీప్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..