Sachin: కోహ్లీ.. నా హృదయాన్ని టచ్ చేశావయ్యా: సచిన్
ముంబయి వేదికగా విరాట్ కోహ్లీ వన్డేల్లో తన సెంచరీల రికార్డును బ్రేక్ చేయడంపై సచిన్ తెందూల్కర్ స్పందించారు.
ముంబయి: వన్డే క్రికెట్ చరిత్రలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 50 సెంచరీలతో తన రికార్డును బ్రేక్ చేయడంపై దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ స్పందించారు. కోహ్లీని ప్రశంసిస్తూ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. కోహ్లీ తనను మొదటిసారి కలిసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ.. ‘‘తొలిసారి నిన్ను ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్లో కలిసినప్పుడు.. నా పాదాలను తాకుతుంటే ఇతర సహచరులు నిన్ను ప్రాంక్ చేశారు. అప్పుడు నాకూ నవ్వు ఆగలేదు. కానీ ఇంతలోనే నీ అంకితభావం, క్రీడా నైపుణ్యంతో నా హృదయాన్ని టచ్ చేశావ్.. ఆ యువకుడు ‘విరాట్’ ప్లేయర్గా ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు.
50 సెంచరీలు.. తిరుగులేని ‘కింగ్’!
వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) న్యూజిలాండ్పై విరాట్ కోహ్లీ (Virat Kohli) శతకం బాది సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ శతకంతో వన్డే చరిత్రలో 50 శతకాలు బాదిన ఏకైక బ్యాటర్గా విరాట్ అవతరించాడు. ఇప్పటి వరకు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (49) కలిసి సమాన రికార్డులో ఉన్న విరాట్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. కేవలం 279 ఇన్నింగ్స్ల్లోనే విరాట్ కోహ్లీ వన్డేల్లో 50వ శతకాన్ని నమోదు చేయడం విశేషం. దీంతో పాటు ఒకే వన్డే ప్రపంచకప్లో 8సార్లు 50+ ఇన్నింగ్స్లు ఆడిన బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. అలాగే ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలోనూ అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటాడు. ఇప్పటి వరకు సచిన్ 2003లో సాధించిన 673 పరుగులే అత్యధికం కాగా.. దాన్ని అధిగమించిన కోహ్లీ ప్రస్తుతం 694 పరుగులతో కొనసాగుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!