Sanju Samson: సంజూ శాంసన్ ఆ వైఖరిని మార్చుకోవాలి: శ్రీశాంత్
Sanju Samson: ప్రపంచకప్ జట్టులోకి సంజూ శాంసన్ను తీసుకోకపోవడంపై అతని అభిమానుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే, ఇది సరికాదని మాజీ పేసర్ శ్రీశాంత్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్ (World Cup 2023)నకు టీమ్ఇండియా జట్టును ప్రకటించినప్పటి నుంచి క్రికెట్ వర్గాల్లో సంజూ శాంసన్ (Sanju Samson) గురించి చర్చ జరుగుతోంది. 15 మందితో కూడిన ప్రపంచకప్ (World Cup 2023) టీమ్తో పాటు ఆస్ట్రేలియా వన్డే సిరీస్కు కూడా అతణ్ని ఎంపిక చేయని విషయం తెలిసిందే. దీంతో అతని అభిమానుల నుంచి తీవ్ర నిరాశ, అసంతృప్తి వ్యక్తమవుతోంది. పలువురు శాంసన్పై సానుభూతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా దీనిపై టీమ్ఇండియా మాజీ ఆటగాడు శ్రీశాంత్ స్పందించాడు. శాంసన్ (Sanju Samson) పట్ల వస్తున్న సానుభూతిపై ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.
శాంసన్ను ప్రపంచకప్ జట్టులోకి తీసుకోకపోవడం బహుశా సరైన నిర్ణయమే అయి ఉండొచ్చని శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు. ఒక ఆటగాడు తనని తాను అర్థం చేసుకోవడం చాలా అవసరమని వ్యాఖ్యానించాడు. గావస్కర్, హర్షా బోగ్లే, రవి శాస్త్రి సహా ప్రతిఒక్కరూ శాంసన్ను మంచి ఆటగాడిగా గుర్తించారని తెలిపాడు. అతని సామర్థ్యంపై ఎలాంటి అనుమానం అవసరం లేదన్నాడు. కానీ ‘‘పిచ్కి అనుగుణంగా ఆడాలని ఎవరైనా సూచిస్తే మాత్రం వినడు. ఆ వైఖరిని మార్చుకోవాలి’’ అని శ్రీశాంత్ సూచించాడు.
ఆ ఇద్దరూ ఉండటం వల్లే సంజూ శాంసన్ను ఎంపిక చేయలేదు: హర్భజన్ సింగ్
తానెప్పుడూ సంజూ (Sanju Samson)కి ఒక విషయం చెబుతానని శ్రీశాంత్ తెలిపాడు. ప్రతి బౌలర్పై విరుచుకుపడకుండా.. వికెట్ను అర్థం చేసుకోవాలని సూచిస్తానని వెల్లడించాడు. ఎవ్వరి బౌలింగ్లోనైనా.. ఎక్కడైనా బాగా ఆడతావని.. అయితే అవకాశం చూసుకుని ఆడొచ్చని చెబుతానని తెలిపాడు. ‘‘నాతో సహా ప్రతిఒక్క మళయాళీ.. సంజూకు అవకాశాలు రావడం లేదని అంటున్నాం. కానీ, అలా అనడం సరికాదు. ఐర్లాండ్, శ్రీలంకపై అతనికి మంచి అవకాశం వచ్చింది. పదేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు. 2013 నుంచి ఆటలో ఉన్నాడు. కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. కానీ, మూడు శతకాలు మాత్రమే బాదాడు. అలాగే ఆటలో ఎక్కడా స్థిరత్వం చూపించలేదు. సమయం ఎవరి కోసం ఆగదు. ప్రతిభ ఉన్న కొత్త ఆటగాళ్లు చాలా మంది వస్తున్నారు. ఆసియా క్రీడలకు ఇద్దరు కీపర్లు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ నీ (శాంసన్) గురించి మాట్లాడుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సానుభూతి పొందడం చాలా సులభం. కానీ, మెప్పు పొందడం చాలా కష్టం’’ అని శ్రీశాంత్ అన్నాడు.
అయితే, శాంసన్ (Sanju Samson) తిరిగి జట్టులోకి వస్తాడనే విశ్వాసం తనకు ఉందని శ్రీశాంత్ అన్నాడు. కొంచెం తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే అన్ని ఫార్మాట్లలో రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కేవలం ఐపీఎల్కి మాత్రమే ఆడడం ద్వారా శాంసన్ (Sanju Samson) లాంటి ప్రతిభ ఉన్న ఆటగాణ్ని టీమ్ఇండియా కోల్పోకూడదని తాను కోరుకుంటున్నానన్నాడు. కానీ, శాంసన్ తన వైఖరిని మార్చుకుంటాడని మాత్రం తాను అనుకోవడం లేదని శ్రీశాంత్ చెప్పడం గమనార్హం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్