Rinku Singh: రింకూ సింగ్ బచ్చా కాదు.. బాప్: షారూక్ ఖాన్
రింకూ సింగ్ గురించి ఒక్కమాటలో చెప్పాలని ట్విటర్లో ఓ అభిమాని షారూక్ఖాన్ (Shah Rukh Khan)ను ప్రశ్నించగా.. ఆయన అదిరిపోయే సమాధానమిచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: రింకూ సింగ్ (Rinku Singh).. ఐపీఎల్-16 సీజన్ వరకు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, ఈ ఏడాది ఐపీఎల్లో ఒకే ఒక్క ఇన్నింగ్స్తో అతడి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. గుజరాత్ టైటాన్స్పై మ్యాచ్ చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదేసి జట్టును గెలిపించడమే కాకుండా కోల్కతా నైట్రైడర్స్ (KKR) జట్టులో స్టార్ ఆటగాడిగా మారిపోయాడు. తీవ్రమైన ఒత్తిడిలోనూ రింకూ సింగ్ అసాధారణ ఇన్నింగ్స్ను చూసి దిగ్గజ క్రికెటర్లు సైతం ఫిదా అయ్యారు. ఇదే జోరు కొనసాగిస్తే అతడిని త్వరలో టీమ్ఇండియా (Team India)కు ఎంపిక కావడం ఖాయమని పలువురు మాజీలు విశ్లేషించారు. బాలీవుడ్ స్టార్ హీరో, కేకేఆర్ సహ యజమాని షారూక్ఖాన్ (Shah Rukh Khan) కూడా రింకూ సింగ్ను ప్రశంసించాడు.
తాజాగా ట్విటర్లో షారూక్ఖాన్ అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో పాల్గొన్నాడు. ‘కేకేఆర్ కా బచ్చా రింకూ సింగ్ గురించి ఒక్క మాటలో చెప్పండి’ అని ఓ అభిమాని షారూక్ను ప్రశ్నించారు. దానికి ‘రింకూ సింగ్ బచ్చా కాదు.. బాప్’ అంటూ షారూక్ఖాన్ అదిరిపోయే సమాధానమిచ్చాడు. రింకూ సింగ్ ఈ ఏడాది ఐపీఎల్లో 14 మ్యాచ్లు ఆడి 59.25 సగటుతో 474 పరుగులు చేశాడు. ఉత్తర్ప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన ఈ క్రికెటర్ జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. త్వరలో విండీస్తో జరిగే టీ20 సిరీస్లో రింకూ సింగ్ను జట్టులోకి తీసుకునే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
చైనాలో కుప్పకూలిన రోడ్డు.. 19మంది మృతి
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
-
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
-
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్