Shahid Afridi: కోహ్లీ.. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆడుతున్నాడా..? లేదా..?: అఫ్రిది
టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఆటతీరుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అసహనం వ్యక్తం చేశాడు. అతడికి మునుపటిలా రాణించాలనే ఉద్దేశం ఉందా...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఆటతీరుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అసహనం వ్యక్తం చేశాడు. అతడికి మునుపటిలా రాణించాలనే ఉద్దేశం ఉందా.. లేదా.. అని అడుగుతున్నాడు. తాజాగా ఓ టీవీ ఛానల్తో మాట్లాడిన పాక్ మాజీ కెప్టెన్.. కోహ్లీ ఆలోచనా విధానం ఎలా ఉందని ప్రశ్నిస్తున్నాడు.
కోహ్లీ రెండున్నరేళ్లుగా ఒక్క సెంచరీ కూడా సాధించలేని సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్లోనూ అంతంత మాత్రంగానే మెరిశాడు. ఈ నేపథ్యంలో అఫ్రిది మాట్లాడుతూ.. ‘క్రికెట్లో ఎవరికైనా తమ ఆటపట్ల కచ్చితమైన ఆలోచనా దృక్పథం ఉండాలి. అది చాలా కీలకం. ఇప్పుడు కోహ్లీకి అలాంటి యాటిట్యూడ్ ఉందా లేదా అనేది తెలియాలి. అతడి కెరీర్ ఆరంభంలో ప్రపంచంలో నంబర్వన్ బ్యాట్స్మన్గా ఉండాలనుకున్నాడు. ఇప్పుడు కూడా ఆ స్ఫూర్తితోనే క్రికెట్ ఆడుతున్నాడా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికీ అతడి ఆటలో క్లాస్ ఉంది. కానీ, మళ్లీ నంబర్ వన్ ఆటగాడిగా ఉండాలనుకుంటున్నాడా..? లేకపోతే ఇప్పటికే అన్నీ సాధించానని భావిస్తున్నాడా? అందుకే ఇప్పుడు ప్రశాంతంగా ఉంటూ టైమ్పాస్ చేస్తున్నాడా? ఇదంతా అతడి ఆలోచనా విధానంలోనే దాగిఉంది’ అని అఫ్రిది విమర్శించాడు.
కాగా, కోహ్లీ ఈసారి భారత టీ20 లీగ్ 15వ సీజన్లో మొత్తం 16 మ్యాచ్లు ఆడి 341 పరుగులే చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు సాధించగా.. 22.73 సగటు నమోదు చేశాడు. అయితే, త్వరలో టీమ్ఇండియా.. ఇంగ్లాండ్ పర్యటనను దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్లు అతడికి దక్షిణాఫ్రికా, ఐర్లాండ్తో టీ20 మ్యాచ్లకు విశ్రాంతినిచ్చారు. మరి ఈ విరామం తర్వాతైనా మునుపటి కోహ్లీని బయటకు తీస్తాడో లేదో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్