SA vs IND: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్.. వన్డేలకు చాహర్.. టెస్టులకు షమీ దూరం
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు షమీ, దీపక్ చాహర్ దక్షిణాఫ్రికా పర్యటనకు (IND vs SA) దూరమయ్యారు. వన్డే సిరీస్కు ఎంపికైన చాహర్ స్థానంలో మరొకరిని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం టీమ్ఇండియా దక్షిణాఫ్రికా (IND vs SA) పర్యటనలో ఉంది. ఇప్పటికే టీ20 సిరీస్ ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం నుంచి (డిసెంబర్ 17) వన్డే సిరీస్ మొదలు కానుంది. అయితే, ఆల్రౌండర్ దీపక్ చాహర్ వన్డే సిరీస్కు దూరమయ్యాడు. తన తండ్రి అత్యవసర వైద్య పరిస్థితి కారణంగా భారత్లోనే ఉండిపోయిన దీపక్.. 50 ఓవర్ల క్రికెట్ సిరీస్లోనూ ఆడేందుకు అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రకటించింది. అతడి స్థానంలో ఆకాశ్ దీప్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. తొలి వన్డే నాటికి జట్టుతోపాటు అతడు చేరే అవకాశం ఉంది. వన్డే సిరీస్కు భారత జట్టు కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తాడు. జట్టులో ఉన్న శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్ మాత్రమే ఆడతాడు. తర్వాతి రెండు వన్డేలు ఆడడు. టెస్టు సిరీస్ కోసం సన్నద్ధమయ్యేందుకే ఈ నిర్ణయమని బీసీసీఐ వెల్లడించింది.
వన్డే సిరీస్కు భారత్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఆకాశ్ దీప్
ఫిట్నెస్ సాధించని షమీ
గాయం కారణంగా వరల్డ్ కప్ తర్వాత క్రికెట్కు దూరమైన షమీ ఫిట్నెస్ నిరూపించుకోవడంలో విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ఎంపిక చేసినా.. ఫిట్నెస్ టెస్టులో పాసైతేనే జట్టులో చోటు కల్పిస్తామని అప్పుడే సెలక్షన్ కమిటీ వెల్లడించింది. తాజాగా ఫిట్నెస్ నిరూపించుకోవడంలో విఫలం కావడంతో టెస్టు సిరీస్కు దూరంగా ఉంటాడని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది. అయితే, అతడి స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్లకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్ బుమ్రా టెస్టు సిరీస్లో పాల్గొంటారు. టెస్టు సిరీస్లో తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి, రెండో టెస్టు జనవరి 3 నుంచి ప్రారంభమవుతాయి.
టెస్టు సిరీస్కు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, బుమ్రా, ప్రసిధ్ కృష్ణ
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత్కు కొత్త కోచింగ్ స్టాఫ్
దక్షిణాఫ్రికాతో డిసెంబరు 17 నుంచి ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్కు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తోపాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాజ్ మంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ అందుబాటులో ఉండట్లేదు. వీరు వన్డే సిరీస్ అనంతరం సఫారీలతో జరిగే రెండు టెస్టుల సిరీస్ ప్రిపరేషన్స్పై దృష్టిపెట్టనున్నారు. దీంతో వన్డే సిరీస్లో ఇండియా ఎ కోచింగ్ బృందం భారత జట్టుకు సహాయం చేయనుంది. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, బౌలింగ్ కోచ్ రాజీబ్ దత్తా, ఫీల్డింగ్ కోచ్ అజయ్ రాత్రాలతో కూడిన ఇండియా ఎ కోచింగ్ స్టాఫ్ అందుబాటులో ఉండనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా