IPL 2023: ఐపీఎల్ 2023.. సరికొత్త పాత్రలో స్టీవ్ స్మిత్!
ఐపీఎల్లోకి (IPL 2023) ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఈసారి మాత్రం ఏ జట్టు తరఫున ఆడేందుకు కాదు. మరి మెగా లీగ్లో అతడి కొత్త పాత్ర ఏంటో తెలుసుకోండి.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) పదహారో సీజన్ ప్రారంభానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులను అలరించడానికి ఆసీస్ తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ సిద్ధమైపోయాడు. అదేంటి, గత ఐపీఎల్ మినీ వేలంలో స్మిత్ను ఎవరూ కొనుగోలు చేయలేదు కదా..? మరెలా అతడు ఐపీఎల్లో కనిపిస్తాడనేదేగా మీ అనుమానం. అయితే, ఈసారి స్టీవ్ స్మిత్ ప్లేయర్గా మైదానంలో దిగడం లేదు. సరికొత్త పాత్రను పోషించేందుకు సిద్దమయ్యాడు. అదే కామెంటేటర్.. ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ కూడా దీనిని ధ్రువీకరించింది. రెండు రోజుల కిందట తాను ఐపీఎల్కు వస్తానని స్మిత్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఏదైనా ఫ్రాంచైజీ రిప్లేస్మెంట్ చేసుకుంటుందేమోనని అంతా భావించారు. తీరా ఇప్పుడు కామెంట్రీ ప్యానెల్లోకి రావడ విశేషం.
‘‘మెగా లీగ్లో స్టీవ్ స్మిత్ భాగం కానున్నాడు. వ్యాఖ్యాతల బృందంతో చేరతాడు. స్టార్ స్పోర్ట్స్తోనే కామెంట్రీ ప్రారంభించడం ఆనందంగా ఉంది’’ అని బ్రాడ్కాస్టర్ ఓ ప్రకటన విడుదల చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై నిషేధం పడిన సమయంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ను కెప్టెన్గా ఫైనల్కు చేర్చిన అనుభవం స్మిత్ సొంతం. అయితే, గత మినీ వేలంలో కనీస ధర రూ. 2 కోట్లతో వచ్చినప్పటికీ.. అతడిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. తాజాగా భారత్తో జరిగిన వన్డే సిరీస్లో ఆసీస్ను విజేతగా నిలిపాడు. ఒక టెస్టులోనూ తన జట్టును గెలిపించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
-
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?