Mumbai Indians - Rohit Sharma: అందుకే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించారు: సునీల్ గావస్కర్
రోహిత్ శర్మను ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) సారథ్య బాధ్యతల నుంచి తప్పించడానికి గల కారణాలను భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) విశ్లేషించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పిస్తూ గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యకు సారథ్య బాధ్యతలు అప్పగించింది ఆ ఫ్రాంఛైజీ. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ని కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని కొంతమంది సమర్థిస్తుండగా.. మరికొందరు తప్పుబడుతున్నారు. భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తాజాగా ఈ అంశంపై మాట్లాడాడు. రోహిత్ని సారథ్య బాధ్యతల నుంచి తప్పించడానికి గల కారణాలను విశ్లేషించాడు.
‘‘మనం తప్పొప్పుల జోలికి వెళ్లకూడదు. కానీ, జట్టుకు ప్రయోజనం చేకూర్చడం కోసమే వారు ఆ నిర్ణయాన్ని తీసుకుని ఉంటారు. గత రెండేళ్లుగా రోహిత్ బ్యాటింగ్లో కాస్త వెనుకబడ్డాడు. అంతకుముందు సీజన్లలో అతడు పెద్ద స్కోర్లు చేశాడు. గత రెండు సీజన్లలో ముంబయి టైటిల్ గెలవలేదు. 2022లో పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ప్లే ఆఫ్స్కి చేరింది. నిరంతరంగా క్రికెట్ ఆడుతూ అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్లో సారథ్య బాధ్యతలతో రోహిత్ కాస్త అలసిపోయి ఉండొచ్చు. హార్దిక్ పాండ్య యువ కెప్టెన్గా మంచి ఫలితాలు సాధించాడు. దీనిని దృష్టిలో ఉంచుకుని అతడిని ముంబయి సారథిగా చేసిందని భావిస్తున్నా. హార్దిక్ గుజరాత్ను రెండుసార్లు ఫైనల్స్కు తీసుకెళ్లడమే కాకుండా 2022లో ఛాంపియన్గా నిలిపాడు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని కొత్త ఉత్సాహంతో ఉన్న హార్దిక్ను ముంబయి కెప్టెన్గా చేసిందనుకుంటున్నా. ఈ నిర్ణయంతో ముంబయి ఇండియన్స్కు నష్టం ఉండదు. ప్రయోజనమే ఉంటుంది’’ అని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
సీఎస్కేలో ధోనీ.. ముంబయిలో రోహిత్ : ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ బలమైన జట్టుగా మారడానికి రోహిత్ శర్మ కెప్టెన్గా ఎనలేని కృషి చేశాడని భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) పేర్కొన్నాడు. ‘‘ముంబయి ఇండియన్స్లో ప్రత్యేక స్థానం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్లో ధోనీకి ఎలాంటి విశిష్ట గుర్తింపు ఉందో ముంబయి జట్టులో రోహిత్కు ఆ స్థాయి ఉందని నా అభిప్రాయం. రోహిత్ కెప్టెన్గా ఎంతో కష్టపడి బలమైన జట్టుగా తయారు చేశాడు. అతడు అద్భుతమైన కెప్టె్న్. బౌలర్లకు మద్దతుగా నిలుస్తాడు. 2023 సీజన్కు స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా అర్చర్ అందుబాటులో లేకున్నా జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ వివరించాడు.
హార్దిక్ పాండ్యను ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా నియమించడాన్ని ఇర్ఫాన్ సమర్థించాడు. అయితే.. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి అనుభవజ్ఞులు ఉన్న జట్టుకు నాయకత్వం సవాల్తో కూడుకున్నదని అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
ఎవరా 15..!
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం