IND vs SA : ఇటీవల టీమ్ఇండియా ఓడిపోవడానికి ప్రధాన కారణమదే: గావస్కర్
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా ఓటమిపై మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం...
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా ఓటమిపై మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. భారత తుది జట్టు కూర్పులోనే భారీ లోటు కనిపించిందని పేర్కొన్నాడు. ఇవాళ పార్ల్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ప్రదర్శనపై ఓ ఛానెల్తో గావస్కర్ మాట్లాడాడు. మూడు వన్డేల సిరీస్ అయిపోయేంత వరకు వేచి చూడాలని అభిమానులను కోరాడు. అంతవరకు ఓపికగా ఉండాలని, జట్టుకు మద్దతుగా నిలవాలని సూచించాడు. ఇదే సందర్భంలో తుది జట్టులో ఓ లోపం కనిపిస్తోందని, అదే టీమ్ను బ్యాలెన్స్ లేకుండా చేసిందని తెలిపాడు. వెంకటేశ్ అయ్యర్తో బౌలింగ్ చేయించాల్సిందిగా పేర్కొన్నాడు.
జట్టులో సమతూకంపై అడిగిన ప్రశ్నకు గావస్కర్ సమాధానం ఇచ్చాడు. ‘‘ఇటీవల కాలంలో తెల్ల బంతి క్రికెట్కు సంబంధించిన ఐసీసీ టోర్నమెంట్లలో ఒకే కారణంతో భారత్ నిరాశపరిచింది. ఒకసారి 1983, 2011 వన్డే ప్రపంచకప్తో పాటు 1985 వరల్డ్ ఛాంపియన్షిప్ విజయాలను పరిశీలించండి. అప్పుడు జట్టులో అద్భుతమైన ఆల్రౌండర్లు ఉన్నారు. అందుకే టైటిళ్లను కైవసం చేసుకోగలిగాం. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేయగలిగే సమర్థులు ఉండేవారు. ఆరు నుంచి ఎనిమిదో స్థానం వరకు ఆల్రౌండర్ల అవసరం ఎంతైనా ఉంది. యువరాజ్, సురేశ్ రైనా వంటి వారినే ఉదాహరణగా తీసుకుంటే రెండు విభాగాల్లోనూ రాణించారు. ఇదే గత రెండు మూడేళ్లుగా టీమ్ఇండియాలో లోపించింది. అంతేకాకుండా సారథికి ఆప్షన్లు లేవు.. ఆటగాళ్ల ఎంపికకు వెసులుబాటు లేకుండాపోయింది. అంతేకాకుండా వెంకటేశ్ అయ్యర్తో కేఎల్ రాహుల్ ఎందుకు బౌలింగ్ చేయించలేదో అర్థం కాలేదు’’ అని గావస్కర్ విశ్లేషించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.