SRH vs PBKS: పంజాబ్ బ్యాట్స్మెన్ టపటపా.. సన్రైజర్స్ ముందు స్వల్ప లక్ష్యం
షార్జా వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ బౌలర్లు రెచ్చిపోయారు. జేసన్ హోల్డర్ 3/19, రషీద్ఖాన్ 1/17, సందీప్ శర్మ 1/20 కట్టుదిట్టంగా పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. మార్క్రమ్ (27)టాప్ స్కోరర్.
ఇంటర్నెట్ డెస్క్: షార్జా వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ బౌలర్లు రెచ్చిపోయారు. జేసన్ హోల్డర్ 3/19, రషీద్ఖాన్ 1/17, సందీప్ శర్మ 1/20 కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ బ్యాట్స్మెన్లలో మార్క్రమ్ (27) ఒక్కడే టాప్ స్కోరర్గా నిలిచాడు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ తొలుత నిలకడగానే ఆడింది. నాలుగు ఓవర్లకు 26/0తో కాస్త మెరుగైన స్థితిలో ఉన్న ఆ జట్టుకు జేసన్ హోల్డర్ ఐదో ఓవర్లో గట్టి షాక్ ఇచ్చాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (21; 21 బంతుల్లో 3×4), మయాంక్ అగర్వాల్ (5)లను ఔట్ చేశాడు. రాహుల్.. సుచిత్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా.. మయాంక్ విలియమ్సన్కి చిక్కాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత స్కోరు వేగం నెమ్మదించింది. క్రిస్ గేల్ (14; 17 బంతుల్లో 1×4) బ్యాట్ ఝళిపించలేదు. రషీద్ ఖాన్ వేసిన 11వ ఓవర్లో గేల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన నికోలస్ పూరన్(8), దీపక్ హుడా (13) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. పూరన్ని సందీప్ శర్మ పెవిలియన్ చేర్చగా.. హోల్డర్ వేసిన 16వ ఓవర్లో హుడా ఔటయ్యాడు. సమద్ వేసిన 15వ ఓవర్లో మార్క్రమ్.. మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. నాథన్ ఎలిస్ (12) భువనేశ్వర్ కుమార్ వేసిన ఓవర్లో పెవిలియన్ చేరాడు. హర్ప్రీత్ బ్రర్ (18) నాటౌట్గా నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను సారథిగా నియమించింది. -
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
జీఎస్టీ చరిత్రలో రికార్డు వసూళ్లు.. ఒక్క నెలలో రూ.2.10 లక్షల కోట్లు!