Team India: అంతపెద్ద టీమ్ఇండియా.. ఇంత ఒత్తిడికి ఎలా గురైంది?
టీమ్ఇండియా ఆటతీరు పట్ల ఇంటా బయటా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టైటిల్ ఫేవరెట్గా టీ20 ప్రపంచకప్లో అడుగుపెట్టిన కోహ్లీసేన తొలి రెండు మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమై సెమీస్కు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా ఆటతీరు పట్ల ఇంటా బయటా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టైటిల్ ఫేవరెట్గా టీ20 ప్రపంచకప్లో అడుగుపెట్టిన కోహ్లీసేన తొలి రెండు మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమై సెమీస్కు చేరకుండానే నిష్క్రమించేందుకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా న్యూజిలాండ్తో ఆటతీరు ఏమాత్రం ఆకట్టుకోలేదు. తొలి మ్యాచ్లో పాకిస్థాన్తో ఓడాక కూడా రెండో మ్యాచ్లో తమ తప్పులు తెలుసుకున్నట్లు కనిపించలేదు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ సారథి ఇంజామామ్ ఉల్ హక్ సైతం టీమ్ఇండియా ఆటతీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా కోహ్లీసేన బ్యాటింగ్ చూసి షాకయ్యానన్నాడు.
‘భారత్-పాక్ తర్వాత ఇదే అతిపెద్ద మ్యాచ్. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ కన్నా భారత్-న్యూజిలాండ్దే కీలకం. అయితే, టీమ్ఇండియా ఆడిన తీరుతో నేను షాక్కు గురయ్యా. ఆటగాళ్లంతా మనోస్థైర్యం కోల్పోయారు. అంతపెద్ద జట్టు ఇంత ఒత్తిడికి ఎలా గురైందో అర్థంకావడం లేదు. కివీస్ స్పిన్నర్లు మెరుగైన బౌలర్లే అయినా.. ప్రపంచ శ్రేణి స్పిన్నర్లు మాత్రం కాదు. వాళ్లు వేసే బంతులకు భారత బ్యాట్స్మన్ సింగిల్స్ కూడా తీయలేకపోయారు. జట్టు సారథి విరాట్ కోహ్లీ బలమే స్పిన్ బౌలింగ్ను దీటుగా ఎదుర్కోవడం. అలాంటిది అతడే పరుగులు చేయలేక ఇబ్బందులు పడ్డాడు’ అని ఇంజమామ్ తన యూట్యూబ్ ఛానల్లో అభిప్రాయపడ్డాడు. కాగా, పాకిస్థాన్తో మ్యాచ్లో 151/7 స్కోర్ చేసిన టీమ్ఇండియా.. కివీస్తో మరింత పేలవ ప్రదర్శన(110/7) చేసింది. దీంతో ఆ రెండు జట్లు టీమ్ఇండియాపై ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ముందున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్ రూల్పైనా మాట్లాడారు. -
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం