IRE vs IND: ఐర్లాండ్తో ఆఖరి టీ20 మ్యాచ్.. ఎవరికి విశ్రాంతి.. ఎవరికి అవకాశం?
ఐర్లాండ్ పర్యటనలో (IRE vs IND) చివరి టీ20 మ్యాచ్ ఆడేందుకు భారత్ సిద్ధమవుతోంది. తుది జట్టులోకి కొత్త ఆటగాళ్లు వచ్చేందుకు ఎదురు చూస్తున్నారు. తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మూడు టీ20ల సిరీస్ను పట్టేశాం.. ఇక చివరి మ్యాచ్లోనూ గెలిచి క్లీన్స్వీప్ చేసి భారత్కు బయల్దేరడమే తరువాయి. బౌలింగ్లో ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు. మినీ టోర్నీ ఆసియా కప్ కోసం జట్టును కూడా ప్రకటించారు. ఇక మిగిలిన యువకులకు అవకాశం ఇవ్వడంపైనే టీమ్ఇండియా(Team India) దృష్టి పెట్టాల్సి ఉంటుంది. డబ్లిన్ వేదికగా జరగనున్న మూడో టీ20 (IRE vs IND) మ్యాచ్ రివ్యూపై ఓ లుక్కేద్దాం..
మినీ టోర్నీగా పిలుచుకునే ఆసియా కప్ 2023కు ముందు టీమ్ఇండియా ఆడనున్న చివరి టీ20 మ్యాచ్. ఇప్పటికే ఆసియా కప్ కోసం జట్టును కూడా బీసీసీఐ ప్రకటించేసింది. ఇప్పుడు ఐర్లాండ్తో టీ20 సిరీస్లో ఆడుతున్న బుమ్రా, ప్రసిధ్, సంజూ శాంసన్ (రిజర్వ్డ్), తిలక్ వర్మకు ఆసియా కప్ జట్టులో స్థానం దక్కింది. ఈ క్రమంలో వారు గాయాలపాలు కాకుండా మిగిలిన ఆటగాళ్లకు అవకాశం ఇస్తే బాగుంటుందనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. అయితే, బౌలర్ల రీప్లేస్ చేయడం సులువే కానీ, బ్యాటర్ల విషయంలో మాత్రం కష్టమే. సంజూ, తిలక్ను పక్కన పెడితే వారిద్దరికి బదులు జట్టులోకి తీసుకోవడానికి బ్యాటర్లు ఎవరూ లేరు. అయితే, జితేశ్ శర్మ ఉండటం వల్ల సంజూను బెంచ్కే పరిమితం చేయొచ్చు. అయితే, బ్యాటింగ్లో ఫామ్ అందుకోవడానికి ఈ మ్యాచ్లోనూ ఆడాలి. తిలక్కు బదులు జితేశ్ను తీసుకోవడం ఉత్తమ నిర్ణయమవుతుంది. ఇద్దరూ ఎడమ చేతివాటం బ్యాటర్లే కావడం విశేషం. ఇక సారథి బుమ్రా విశ్రాంతి తీసుకుని డిప్యూటీగా ఉన్న రుతురాజ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తాడా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది.
బౌలర్లుగా వారిద్దరు.. ఆల్రౌండర్గా అతడు
అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ మాత్రమే ఈ సిరీస్లో ఆడని పేసర్లు. ఇప్పుడు ప్రసిధ్, బుమ్రాలో ఒకరితోపాటు అర్ష్దీప్నకు విశ్రాంతి ఇచ్చి వారిని తుది జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో షహబాజ్ అహ్మద్ తన ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. షహబాజ్తోపాటు జితేశ్ శర్మ అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి బిష్ణోయ్ స్థానానికి ఎలాంటి ఇబ్బంది లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్ల జాబితాలో బిష్ణోయ్ ఒక్కడే ఉన్నాడు. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ బౌలింగ్నూ పరీక్షించేందుకు అవకాశం లేకపోలేదు. శివమ్ దూబె కూడా బౌలింగ్ చేయగల సమర్థుడే. చివరి మ్యాచ్ కావడంతో ఐర్లాండ్ కూడా తమ అస్త్రాలకు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. విజయం కోసం చివరి వరకు పోరాడే ఆటగాళ్లు ఆ జట్టు సొంతం.
వాతావరణం.. పిచ్ రిపోర్ట్
రెండో టీ20కి వర్షం అడ్డంకిగా లేకపోవడంతో పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. కానీ, చివరి మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది. అయితే, మ్యాచ్ ఆగే స్థాయిలో మాత్రం వర్షం ఉండకపోవచ్చు. దీంతో టాస్ సమయానికి వాతావరణం ఎలా ఉంటుందో... దాని ప్రకారమే బ్యాటింగ్ లేదా బౌలింగ్పై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి.
భారత జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్ /జితేశ్ శర్మ, రింకు సింగ్, శివమ్ దూబె, షహబాజ్ అహ్మద్/వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ప్రసిధ్ కృష్ణ/అవేశ్ ఖాన్, బుమ్రా, ముకేశ్ కుమార్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
ఐపీఎల్లో సత్తా చాటుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి.. ఏపీఎల్లోనూ భారీ ధరను దక్కించుకోవడం విశేషం. -
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
ఆదివారం రాజస్థాన్తో కోల్కతా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ప్లేఆఫ్స్నకు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ ఆటతీరుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
వరల్డ్ కప్ జట్టులో కొందరు యువ క్రికెటర్లకు అవకాశం రాలేదు. అనుకోకుండా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ జట్టులోకి వచ్చాడు. అతడి ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. -
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి