Team India: టాప్ ఆర్డర్లో ఒక్కడే ఆడితే ఎలా... ‘ఇందౌర్’ పరాజయం భారత్లో మార్పు తెస్తుందా?
ఆస్ట్రేలియా (Australia) సిరీస్లో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్తో రెండు టెస్టులు గట్టెక్కిన భారత్ (Team India).. మూడో టెస్టు (India vs Australia 3rd Test)లో కుదేలైంది. టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లోపం ఉందని తెలిసినా.. మూడో టెస్టులో అది కొట్టొచ్చినట్లు కనిపించింది.
టీమ్ ఇండియా (Team India) బ్యాటింగ్లో డెప్త్ ఎక్కువ. ముగ్గురు స్పిన్ ఆల్రౌండర్లు (Jadeja, Ashwin, Axar) ఉండటంతో ఆ అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ధీమానే భారత్ను దెబ్బకొట్టిందా? ఇండోర్ టెస్టు (Indore Test)లో ఫలితం చూశాక ఇదే అనిపిస్తోంది.
భారత్ (Team India) టాప్ ఆర్డర్ ప్రదర్శన గత కొన్ని రోజులుగా ఏమంతగా బాలేదు. లోయర్ ఆర్డర్ అద్భుతమైన ప్రదర్శన వల్లనో, బౌలర్ల విజృంభణ వల్లో గెలుస్తూ వస్తోంది. ఆస్ట్రేలియా (Australia)తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy) కోసం తలపడుతున్న భారత జట్టు బ్యాటింగ్ లైనప్ను పేపర్ మీద రాస్తే.. KGF సినిమాలోని ఎలివేషన్ సీన్స్ కంటే తక్కువేం ఉండదు. రోహిత్ శర్మ, కేఎల్ రాహల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్.. ఇలా అందరూ స్టార్ ఆటగాళ్లే. వీళ్లంతా ప్రపంచస్థాయి ప్రదర్శనతో ప్రత్యర్థికి చెమటలు పట్టించేవాళ్లే. కానీ గన్లో ఆరు బులెట్లు ఉండి.. ఒకటే పేలుతుంది.. మిగిలినవన్నీ తుస్ మంటాయి అంటే ఎలా? ఇప్పుడు టీమ్ ఇండియాలోనూ అంతే. ఒక టెస్టులో ఒకరు బాగా ఆడితే.. మరో టెస్టులో ఇంకొకరు ఆడుతున్నారు.
గత ఐదు ఇన్నింగ్స్లు చూస్తే ఈ విషయం మీకే క్లియర్గా అర్థమైపోతుంది. ఆసీస్తో జరిగిన మూడు టెస్టుల్లో భారత్ టాప్ ఆర్డర్ ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. ఎవరికి వారు రావడం, పరుగులు కొట్టడం, వెళ్లిపోవడం. ఇదే తంతు. పార్ట్నర్ షిప్లు బిల్డ్ చేసి.. పెద్ద స్కోర్ చేసే ఆలోచన ఉన్నట్లు కనిపించలేదు. అయితే ఇదే సమయంలో మన స్టార్ ఆల్రౌండర్ల నుంచి మంచి పరుగులు కనిపిస్తున్నాయి, పార్ట్నర్ షిప్లూ కనిపిస్తున్నాయి. పనిలో పనిగా వారి ప్రదర్శన వల్ల విజయాలూ వస్తున్నాయి.
వెయిటింగ్ గేమ్ ఆడలేక...
క్రికెట్ పరిశీలకులు ఎప్పుడూ చెప్పే మాటే.. టెస్టుల్లో ఎంతసేపు క్రీజులో నిలిస్తే అంత బాగా ఆడగలరు అని. అయితే దానికి ఓపిక కావాలి. మన జట్టులో ఆ ఓపిక ఏడో డౌన్ తర్వాతే వస్తుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే టాప్ ఆర్డర్లో పెద్దగా కనిపించడం లేదు కాబట్టి. ఒక టెస్టులో ఎక్కువసేపు నిలబడి మంచి పరుగులు చేశాడు, ఇక కుదురుకున్నట్లే అనుకోవడమే ఆలస్యం.. తర్వాతి ఇన్నింగ్స్లోనో, టెస్టులోనే ఆ ఆటగాడు బోల్తాపడుతున్నాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్లకు బౌలింగ్ వేసిన లోయర్ ఆర్డర్ వాళ్లకూ వేస్తున్నారుగా అనే డౌట్ కచ్చితంగా వస్తుంది. అయితే మరి లోయర్ ఆర్డర్ ఇండోర్ టెస్టులో భారత్ను ఎందుకు గెలిపించలేదు అనే ప్రశ్న రావొచ్చు. వాళ్లు ఈ మ్యాచ్లో రాణించలేదు కాబట్టే.. ఈ మ్యాచ్లో భారత్ ఓటమిపాలైంది అనేది విశ్లేషకుల అంచనా.
టాప్ ఆర్డర్లో ఏ మ్యాచ్లో ఎవరు ఆడారంటే...
- తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ సెంచరీ (120)తో కదం తొక్కాడు. మిగిలిన టాప్ ఆర్డర్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. అయితే రవీంద్ర జడేజా (70), అక్షర్ పటేల్ (84) అర్ధ శతకాలు బాది జట్టుకు భారీ స్కోరు అందించారు.
- రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ (44)నే టాప్ ఆర్డర్లో రాణించాడు. ఇక్కడ అక్షర్ పటేల్ (74), అశ్విన్ (37), జడేజా (26) తోడవడంతో జట్టుకు ఉపయుక్తకరమైన పరుగులు వచ్చి.. విజయం లభించింది.
- ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో చూస్తే.. ఇటు టాప్ ఆర్డర్, అటు లోయర్ ఆర్డర్లో ఎవరూ అర్ధ సెంచరీ వరకు వెళ్లలేకపోయారు. ఆ మాటకొస్తే ముచ్చటగా 30 పరుగులు కూడా దాటలేదు.
- మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్కి వచ్చేసరికి ఛెతేశ్వర్ పుజారా (59) అర్ధ శతకంతో జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. టాప్ ఆర్డర్లో మిగిలిన వాళ్లు ఎప్పటిలాగే త్వరగా ఔటయ్యారు. మరోవైపు మన ముగ్గురు స్పిన్ బ్యాటర్లు కూడా విఫలమయ్యారు.
గత 3 టెస్టుల్లో భారత్ బ్యాటింగ్ తీరు
అన్నిసార్లు లోయర్ ఆర్డర్ కాపాడుతుందని అనుకోవడం, ఆశించడమూ తప్పే. టాప్ ఆర్డర్ సరైన పునాది వేస్తే లోయర్ ఆర్డర్ దాని మీద ఏదో ఒకటి చేయగలుగుతుంది. కీలకమైన WTC ఫైనల్స్ అవకాశం సంపాదించాలన్నా, ఒకవేళ సాధించి ఫైనల్లో గెలవాలన్నా.. మన బ్యాటర్లు అందులోనూ టాప్ ఆర్డర్ బ్యాటర్లు విజృంభించాలి. ఈ అద్భుతమైన సన్నివేశం అహ్మదాబాద్ టెస్టులో జరుగుతుందని ఆశిద్దాం!
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!