ICC: ప్రపంచ కప్ ఫైనల్ హీరోకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు
ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్లో అదరగొట్టిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) నవంబర్ నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్లో అదరగొట్టిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) నవంబర్ నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికయ్యాడు. భారత పేసర్ మహ్మద్ షమి (Mohammed Shami), ఆసీస్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) కూడా ఈ అవార్డు రేసులో ఉండగా.. చివరకు హెడ్ విజేతగా నిలిచాడు. 2023 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా ఛాంపియన్గా నిలవడంలో ట్రావిస్ హెడ్ కీలకపాత్ర పోషించాడు. చేతికి వేలి గాయం కారణంగా టోర్నీలో మొదటి సగం మ్యాచ్లకు దూరంగా ఉన్న అతడు తర్వాత జట్టులో కీలకంగా మారాడు. ముఖ్యంగా సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో అద్భుతంగా ఆడాడు. సెమీస్లో దక్షిణాఫ్రికాపై (62) పరుగులు చేసి అతడు.. తుది పోరులోనూ సత్తాచాటాడు. భారత్ ఇన్నింగ్స్లో కీలకమైన రోహిత్ శర్మ క్యాచ్ను అందుకున్నాడు. 241 పరుగుల లక్ష్యఛేదనలో 47/3 స్కోరుతో కష్టాల్లో పడిన ఆసీస్ను ట్రావిస్ హెడ్ (137; 120 బంతుల్లో) వీరోచిత శతకంతో ఆదుకున్నాడు. దీంతో ఏడు ఓవర్లు మిగిలుండగానే ఆస్ట్రేలియా విజయం సాధించింది.
మహిళల క్రికెట్లో బంగ్లాదేశ్ యువ స్పిన్ సంచలనం నహిదా అక్టర్ నవంబర్ నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది. బంగ్లా టాప్ ఆర్డర్ బ్యాటర్ ఫర్గానా, పాక్ స్పిన్నర్ సాదియా ఇక్బాల్ను వెనక్కినెట్టి నహిదా ఈ అవార్డును దక్కించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. -
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.