ICC: ఐసీసీ అత్యంత విలువైన జట్టు ఇదే.. కోహ్లీ, సూర్యకు చోటు
పురుషుల టీ20 ప్రపంచకప్ 2022లో అత్యంత విలువైన ఆటగాళ్లతో కూడిన టీమ్ను ఐసీసీ తాజాగా ప్రకటించింది.
దిల్లీ: పురుషుల టీ20 ప్రపంచకప్ 2022లో అత్యంత విలువైన ఆటగాళ్లతో కూడిన టీమ్ను ఐసీసీ తాజాగా ప్రకటించింది. టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. తాజా టోర్నీలో 98.66 సగటుతో 296 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ ఈ జాబితాలో ముందు వరసలో నిలిచాడు.
పాక్పై అద్భుతంగా ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ (82*) ఒంటిచేత్తో జట్టును గెలిపించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్పై 64, నెదర్లాండ్స్ మీద 62, ఇంగ్లాండ్తో 50 పరుగులు చేసి టీ20 ప్రపంచకప్లో విరాట్ అత్యుత్తమ బ్యాటర్గా నిలిచాడు. ఈ టోర్నీలో 239 పరుగులతో అదరగొట్టిన సూర్యకుమార్ కూడా చోటు దక్కించుకున్నాడు. నెదర్లాండ్స్తో 51, దక్షిణాఫ్రికాతో 68, జింబాబ్వేతో 61 పరుగులు చేసి మూడు అర్థ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్న ఈ ఆటగాడు అద్భుతమైన స్ట్రైక్రేట్(189.68)ను ప్రదర్శించాడు.
మొత్తం ఆరు దేశాల జట్లను ఇందుకోసం ఎంపిక చేశారు. కప్ గెలిచిన ఇంగ్లాండ్, రన్నరప్గా నిలిచిన పాకిస్థాన్, సెమీ ఫైనల్కు చేరుకున్న భారత్, న్యూజిలాండ్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇంగ్లాండ్ రెండో సారి టీ20 కప్పు గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఆటగాళ్లు.. కెప్టెన్, వికెట్ కీపర్, ఓపెనింగ్ బ్యాటర్ జోస్ బట్లర్, సహచర ఓపెనర్ అలెక్స్ హేల్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సీమర్ సామ్ కరన్ పేర్లను ప్రస్తావిస్తూ ఐసీసీ తన జాబితాను విడుదల చేసింది. 128 పరుగులు, 8 వికెట్లతో టీమ్ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య 12వ ఆటగాడిగా ఈ టీమ్లో చోటు దక్కించుకున్నాడు. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, పాక్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్, పేసర్ షహీన్ షా అఫ్రిది సైతం ఈ జాబితాలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. -
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.