IPL : ఐపీఎల్కు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు దూరం.!
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, జోష్ హేజిల్వుడ్, ప్యాట్ కమ్మిన్స్ సహా మరికొందరు.. త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొన్ని మ్యాచులకు దూరం..
ఇంటర్నెట్ డెస్క్ : ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, జోష్ హేజిల్వుడ్, ప్యాట్ కమ్మిన్స్ సహా మరికొందరు.. త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొన్ని మ్యాచులకు దూరం కానున్నారు.! ద్వైపాక్షిక సిరీస్ కోసం పాకిస్థాన్లో పర్యటించనున్న ఆస్ట్రేలియా జట్టులో వీళ్లంతా సభ్యులుగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటకీ.. మార్చి ఆఖరులో లీగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది!
ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా.. పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు మార్చి 4 - 25 వరకు టెస్టు సిరీస్, మార్చి 29 - ఏప్రిల్ 2 మధ్య వన్డే సిరీస్, ఏప్రిల్ 5న ఓ టీ20 మ్యాచ్ జరుగనుంది. డేవిడ్ వార్నర్, జోష్ హేజిల్వుడ్, ప్యాట్ కమ్మిన్స్.. టెస్టు సిరీస్లో ఆడనున్నారు. ఆ తర్వాత జరుగనున్న వన్డే సిరీస్లో కూడా వీరికి చోటు దక్కినా ఐపీఎల్లో ఆడటం కోసం పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి తప్పుకున్నారు. మరోవైపు, ఆల్ రౌండర్లు మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, పేసర్లు జాసన్ బెహ్రెన్డార్ఫ్, సీన్ అబాట్, నాథన్ ఎలిస్ వంటి ఆటగాళ్లు కూడా వన్డే, టీ20 జట్టులో భాగంగా ఉన్నారు. అయితే, నిబంధనల ప్రకారం.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్న ఆటగాళ్లు ద్వైపాక్షిక సిరీస్ ముగిసే వరకు మరే టోర్నీలో ఆడేందుకు వీలులేదు. దీంతో వీళ్లంతా ఐపీఎల్లో కొన్ని మ్యాచులకు దూరం కానున్నారు.
‘ఐపీఎల్ అంటే నాకెంతో గౌరవముంది. టీ20 క్రికెట్లో భారత్ ముందంజలో ఉంది. ఈ మెగా టోర్నీలో ఆడటంతో మా ఆటగాళ్లు కూడా మరింత మెరుగవుతున్నారు. అందుకే, ఈ టోర్నీని తక్కువ అంచనా వేయలేం. అయితే, సీఏ నిబంధనల ప్రకారం ద్వైపాక్షిక సిరీస్ ముగిసే వరకు ఆటగాళ్లను భారత్కి పంపలేం’ అని సీఏ సెలెక్షన్ కమిటీ చీఫ్ జార్జ్ బెయిలీ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్తో సిరీస్ ముగిసిన తర్వాత ఏప్రిల్ 6న ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్కి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన వేలంలో డేవిడ్ వార్నర్ని దిల్లీ క్యాపిటల్స్, హేజిల్ వుడ్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్యాట్ కమ్మిన్స్ (కేకేఆర్) జట్లు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సీఏతో ఒప్పందం కుదుర్చుకోని డేనియల్ సామ్స్, రిలే మెరెడిత్, నాథన్ కోల్టర్ నైల్, టిమ్ డేవిడ్ లాంటి ఆటగాళ్లు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఐపీఎల్లో పాల్గొనవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!