IPL - 2022 : దిల్లీ ఆటగాళ్లకు టార్గెట్ ఫిక్స్ చేసిన పాంటింగ్.!
త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ టార్గెట్ ఫిక్స్ చేశాడు. పాత ఆటగాళ్లు.. ఇటీవల కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లకు అందుబాటులో ఉండాలని సూచించాడు...
ఇంటర్నెట్ డెస్క్ : త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ టార్గెట్ ఫిక్స్ చేశాడు. పాత ఆటగాళ్లు.. ఇటీవల కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లకు అందుబాటులో ఉండాలని సూచించాడు. ఇటీవల తొలి సెషన్లో పాల్గొన్న ఆటగాళ్లను ఉద్దేశించి రికీ పాంటింగ్ మాట్లాడాడు. ఆ వీడియోను దిల్లీ యాజమాన్యం ట్విటర్ ఖాతాలో పంచుకుంది.
‘కెప్టెన్ రిషభ్ పంత్, పృథ్వీ షా, అన్రిచ్ నార్జ్, అక్షర్ పటేల్.. జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్ల బాధ్యతను తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఎక్కడికి వెళ్లినా కొత్త ఆటగాళ్లను వెంట తీసుకెళ్లాలి. వారికి అందుబాటులో ఉండేలా.. ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంచాలి. ఓ కోచ్గా, సీనియర్ ఆటగాడిగా జట్టులోని యువ ఆటగాళ్లను చేరదీస్తే.. వాళ్లు మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తారు. కెప్టెన్గా రిషభ్ పంత్ ఎప్పుడూ ఆటగాళ్లకు అందుబాటులో ఉండాల్సిందే. అతడితో పాటు మిగతా ఆటగాళ్లు కూడా బాధ్యతలు పంచుకుంటే బాగుంటుంది’ అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. కెప్టెన్ రిషభ్ పంత్, ఓపెనర్ పృథ్వీ షా, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, పేసర్ అన్రిచ్ నార్జ్లను దిల్లీ యాజమాన్యం వేలానికి ముందే రిటెయిన్ చేసుకున్న విషయం తెలిసిందే.
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, టిమ్ సీఫర్ట్, రోమన్ పాలెవ్ వంటి విదేశీ ఆటగాళ్లతో పాటు.. విక్కీ ఓత్స్వాల్, చేతన్ సకారియా, యశ్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, కమలేశ్ నాగర్ కోటి వంటి యువ ఆటగాళ్లను కూడా దిల్లీ యాజమాన్యం వేలంలో దక్కించుకుంది. మార్చి 27న ముంబయి ఇండియన్స్తో జరుగనున్న మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది.
* ఆయనను ఎప్పుడు కలిసినా ప్రత్యేకమే : రిషభ్ పంత్
‘మా కోచ్ రికీ పాంటింగ్ను ఎప్పుడూ కలిసినా.. చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. సొంత కుటుంబ సభ్యులను కలిశామన్న భావన కలుగుతుంది. మైదానంలో ఆటగాళ్లు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలా ప్రోత్సహిస్తారు. ప్రస్తుత నెట్ సెషన్స్లో జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్లతో మాట్లాడాం. వారిని మైదానంలో ఎలా ఉపయోగించుకోవాలనే దాని గురించి చర్చించాం. ఈ సారి మా జట్టులో భారీ మార్పులు వచ్చాయి. ప్రాక్టీస్ సెషన్లో ప్రతి ఆటగాడిని గమనించాను. మా ఆటగాళ్లంతా సానుకూల దృక్పథంతో ఉన్నారు. కొత్త ఆటగాళ్లు కూడా జట్టులో కలిసిపోయారు’ అని దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్