INDW vs AUSW : వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం.. ఓటమి దిశగా టీమ్‌ఇండియా

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్నవన్డే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమి దిశగా సాగుతోంది. అయితే, ప్రస్తుతం మ్యాచ్‌కు వర్షం అంతరాయం...

Updated : 19 Mar 2022 13:33 IST

ఆక్లాండ్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న వన్డే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమి దిశగా సాగుతోంది. అయితే, ప్రస్తుతం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికి ఛేదనలో ఆస్ట్రేలియా 41 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. ఎల్లిసి పెర్రీ (28), మెగ్‌ లానింగ్‌ (73) శతక భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. ఆ జట్టు విజయానికి ఇంకా 54 బంతుల్లో 53 పరుగులు కావాలి. ఇక టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్‌ చేసి 277/8 స్కోర్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ మ్యాచ్‌ ఫలితాన్ని డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో నిర్ణయిస్తే ఇప్పుడున్న స్కోర్‌తో ఆసీస్‌ విజయం సాధించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని