Team India: ఐపీఎల్ కంటే వరల్డ్ కప్ గెలవడం చాలా ముఖ్యం.. ఎందుకంటే?: గంభీర్
ఈ ఏడాది భారత (Team India) క్రికెట్ షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉండనుంది. వరుసగా ద్వైపాక్షిక సిరీస్లతోపాటు ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలను తలపడాల్సి ఉంటుంది. అలాగే భారత క్రికెటర్లు ఐపీఎల్లోనూ (IPL 2023) ఆడతారు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ - 2023 టోర్నమెంట్కు భారత్ అతిథ్యం ఇవ్వనుంది. పన్నెండేళ్ల తర్వాత మరోసారి కప్ను అందుకోవాలనే కలను నెరవేర్చుకోవాలని టీమ్ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు. దీని కోసం తుది జట్టుపై కీలక నిర్ణయాలు తీసుకోవాలి. దాదాపు రెండున్నర నెలలపాటు ఐపీఎల్ జరగనుంది. ఈ క్రమంలో ఆటగాళ్లపై పనిఒత్తిడి భారం కాకుండా బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేయాలని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సూచించాడు. అందుకోసం ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
ఐపీఎల్ కంటే భారత్ క్రికెట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ కోసం సన్నద్ధత కోసం కీలక ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడించకపోయినా ఫ్రాంచైజీలు బాధపడకూడదని చెప్పాడు. ప్రపంచకప్ కంటే ఏదీ ముఖ్యమైంది కాదని స్పష్టం చేశాడు. ‘‘ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023ను దృష్టిలో పెట్టుకొని భారత భవిష్యత్తు పర్యటనల ప్రణాళిక ఉంది. ఐపీఎల్ 2023 సీజన్లో పాల్గొనే టాప్ ఆటగాళ్ల ఫిట్నెస్, ఫామ్పై ఎప్పటికప్పుడు ఫ్రాంచైజీలతో కలిసి జాతీయ క్రికెట్ అకాడమీ పర్యవేక్షించాలి’’ అని అన్నారు.
ఈసారి వాళ్లు ఆడకపోతే నష్టం లేదు
‘‘2023లో మాత్రం భారత క్రికెట్ ప్రధాన లక్ష్యం వన్డే ప్రపంచ కప్ టోర్నీనే కావాలి. ఈ సందర్భంగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు కాస్త ఇబ్బంది పడొచ్చు. అయితే అంతిమంగా భారత జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఎవరైనా పెద్ద ప్లేయర్ ఐపీఎల్ను మిస్ అయితే వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే ఐపీఎల్ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. వరల్డ్ కప్ అనేది నాలుగేళ్లకొకసారి మాత్రమే వస్తుంటుంది. నా వరకైతే ఐపీఎల్ టైటిల్ను నెగ్గడం కంటే ప్రపంచకప్ను సాధించడం చాలా ముఖ్యం. ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకొని ఉత్తమ జట్టును సిద్ధం చేయాలి. ఎవరికైనా విశ్రాంతి కావాలంటే వారికి టీ20 సిరీస్ల నుంచి ఇవ్వాలి. అంతేగానీ వన్డేల నుంచి మాత్రం ఇవ్వకూడదు. మెగా టోర్నీ బరిలోకి దిగే జట్టు సభ్యులు కలిసి ఆడేలా చూడాలి. ఇదే గత రెండు ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ చేసిన అతి పెద్ద తప్పిదం. వేర్వేరు సిరీస్లకు వేర్వేరు జట్లను ప్రకటించి ఇబ్బంది పడింది. అత్యుత్తమ తుది జట్టుతో ఎన్ని మ్యాచ్లు ఆడింది..? ప్రపంచకప్ సమయంలో కేవలం వారిపైనే దృష్టి పెడితే బాగుంటుంది’’ అని గంభీర్ తెలిపాడు. ప్రస్తుతం గంభీర్ ఐపీఎల్లోని లక్నవూ సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఫ్రాంచైజీకి మెంటార్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్