WPL 2024 : సగం మ్యాచ్లు పూర్తి.. ప్లేఆఫ్స్ రేసులో నిలిచేదెవరు..?
డబ్ల్యూపీఎల్ 2024(WPL 2024) సీజన్లో సగం మ్యాచ్లు పూర్తయ్యాయి. ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్ : మహిళల ప్రీమియర్ లీగ్ 2024(WPL 2024) ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటికే అన్ని జట్లు సగం మ్యాచ్లు ఆడేశాయి. ఆయా జట్ల ఆటతీరుపై అభిమానులూ ఓ అంచనాకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ రేసులో ఎవరు ఉంటారు.. ఎవరు ఇంటిముఖం పడతారనేది ఆసక్తికరంగా మారింది.
మొత్తం ఐదు జట్లు తలపడే డబ్ల్యూపీఎల్లో ఒక్కో టీమ్.. ఎనిమిదేసి మ్యాచ్లు ఆడుతుంది. ఇప్పటికే అన్ని జట్లు నాలుగు మ్యాచ్లు ఆడేశాయి. జోరుమీదున్న దిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ ప్లేఆఫ్స్ రేసులో ముందుండగా.. గుజరాత్ జెయింట్స్ ఇప్పటి వరకూ విజయాల ఖాతా తెరవక ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
సన్రైజర్స్కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు..
ప్లేఆఫ్స్ అవకాశాలు ఎవరికి ఎలా ఉన్నాయంటే..
దిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals Women) : మెగ్ లానింగ్ సారథ్యంలో ఈ జట్టు అన్ని విభాగాల్లో రాణిస్తూ ఈ సీజన్లో దూసుకెళ్తోంది. ఆడిన నాలుగింట్లో.. మూడు విజయాలతో 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మెరుగైన రన్రేట్ ఉండటం కలిసొచ్చే విషయం. ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఈ జట్టుకు ఎక్కువగా ఉన్నాయి. ఇదే ఊపును కొనసాగిస్తే.. అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్కూ చేరుకోవచ్చు.
ముంబయి ఇండియన్స్(Mumbai Indians Women) : డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ముంబయి జట్టు కూడా మెరుగైన ప్రదర్శనే చేస్తోంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు విజయాలు నమోదు చేసింది. రన్రేట్ ప్రభావంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. తదుపరి మ్యాచ్ల్లో విజయం సాధిస్తే.. ఫ్లేఆఫ్స్ చేరడం ఖాయమే. రన్రేట్ మెరుగుపరుచుకుంటే అగ్రస్థానంలోకి దూసుకెళ్లే అవకాశమూ ఉంది.
యూపీ వారియర్స్(UP Warriorz) : ఆడిన నాలుగింట్లో రెండు విజయాలే నమోదు చేసింది. ప్లేఆఫ్స్ చేరాలంటే మిగతా మ్యాచ్ల్లో గెలవడమే కాకుండా.. ఇతర జట్ల ఫలితాలు తనకు కలిసిరావాలి. రన్రేట్ ప్లస్లో ఉండటమే కొద్దిగా కలిసొచ్చే అంశం.
ఆర్సీబీ(Royal Challengers Bangalore Women) : వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి అంచనాలు పెంచిన స్మృతి మంధాన జట్టు.. ఆ తర్వాత డీలా పడింది. రెండు వరుస ఓటములతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. రన్రేట్ మైనస్లో ఉండటం ప్రతికూలాంశం. మిగతా మ్యాచ్ల్లో గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. ఇతర జట్ల ఫలితాలు కూడా దీని ప్లేఆఫ్స్ అవకాశాలపై ప్రభావం చూపిస్తాయి.
గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) : గత సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన గుజరాత్ జట్టు పరిస్థితి ఈ సీజన్లోనూ అలాగే ఉంది. ఇప్పటి వరకూ ఆడిన నాలుగింట్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతూ.. ప్లేఆఫ్స్ అవకాశాలను పూర్తిగా సంక్లిష్టం చేసుకుంది. ఈ జట్టు రేసులో నిలవాలంటే.. మిగతా 4 మ్యాచ్ల్లో భారీ విజయాలు నమోదు చేయాలి. అదే సమయంలో ఇతర జట్ల ఫలితాలు కలిసిరావాలి.
ప్లేఆఫ్స్ ఫార్మాట్ ఇలా..
పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లే ప్లేఆఫ్స్ చేరుకుంటాయి. అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ ఆడుతుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఇందులో విజేత.. ఫైనల్లో తలపడుతుంది. మార్చి 15న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుండగా.. 17న ఫైనల్ ఉండనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్