Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024.. సన్రైజర్స్కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు..
సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ను నియమించుకుంది. మార్క్రమ్ స్థానంలో ఆసీస్ స్టార్ను సారథిగా నియమిస్తూ ప్రకటన వెలువరించింది.
ఇంటర్నెట్ డెస్క్: మినీ వేలంలో భారీగా వెచ్చించి మరీ సొంతం చేసుకున్న ప్యాట్ కమిన్స్కు సన్రైజర్స్ హైదరాబాద్ ప్రమోషన్ ఇచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్కు కెప్టెన్గా నియమిస్తూ కీలక ప్రకటన చేసింది. గత సీజన్లో జట్టును నడిపించిన ఐదెన్ మార్క్రమ్ను బాధ్యతల నుంచి తప్పించి కమిన్స్కు అప్పగించింది. మార్చి 23న కోల్కతా నైట్రైడర్స్తో హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కమిన్స్ను సన్రైజర్స్ రూ. 20.5 కోట్లకు దక్కించుకుంది. కెప్టెన్గా ఆసీస్కు టీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్ను అందించిన ఘనత కమిన్స్ సొంతం. దీంతో ఈసారి ఎలాగైనా మెరుగైన ప్రదర్శనతో రాణించాలనే లక్ష్యంతో సన్రైజర్స్ హైదరాబాద్ కమిన్స్ను సారథిగా నియమించింది.
పేస్ బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్స్టెయిన్ స్థానంలో న్యూజిలాండ్కు చెందిన జేమ్స్ ఫ్రాంక్లిన్ను సన్రైజర్స్ నియమించింది. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్కు అందుబాటులో ఉండనని ఇప్పటికే స్టెయిన్ సమాచారం ఇచ్చినట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ కేవలం నాలుగు మ్యాచుల్లోనే గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. అప్పటి కెప్టెన్ ఐదెన్ మార్క్రమ్ కూడా గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. కొన్ని మ్యాచుల్లో మెరిసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. దీంతో ఈసారి మార్క్రమ్ బదులు ప్యాట్ కమిన్స్కు బాధ్యతలు అప్పగించింది.
జట్టు ఇదే:
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, ఐదెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, అన్మోల్ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, సన్విర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హక్ ఫరూఖి, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండె, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగ, జయ్దేవ్ ఉనద్కత్, ఆకాశ్ సింగ్, సుబ్రమన్యన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.