WTC Finals: భారత్ గెలవాలి కానీ.. : యువీ
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్లో టీమ్ఇండియా విజయం సాధించాలని మాజీ ఆల్రౌండర్ యువరాజ్సింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఛాంపియన్షిప్ ఆలోచన మంచిదని, దాంతో టెస్టు క్రికెట్ను మరోస్థాయికి తీసుకెళ్లొచ్చని యువీ పేర్కొన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్లో టీమ్ఇండియా విజయం సాధించాలని మాజీ ఆల్రౌండర్ యువరాజ్సింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఛాంపియన్షిప్ ఆలోచన మంచిదని, దాంతో టెస్టు క్రికెట్ను మరోస్థాయికి తీసుకెళ్లొచ్చని యువీ పేర్కొన్నాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్తో మాట్లాడిన అతడు ఫైనల్స్లో టీమ్ఇండియా గెలవాలని ఉన్నా.. న్యూజిలాండ్కే కాస్త ఎక్కువ అనుకూలత ఉందన్నాడు. ‘టెస్టు క్రికెట్ను మరోస్థాయికి తీసుకెళ్లడం మంచి ఆలోచన. టీమ్ఇండియా బలంగా ఉందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇటీవలి కాలంలో కోహ్లీసేన విదేశాల్లో నిజంగా అద్భుతంగా రాణిస్తోంది. ఎక్కడైనా విజయం సాధిస్తామనే ధీమా ఆటగాళ్లలో నెలకొంది. అయితే, ఇంగ్లాండ్లోని పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. మరోవైపు డ్యూక్బాల్ కూడా ప్రభావం చూపిస్తాయి’ అని మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.
టీమ్ఇండియా ఆటగాళ్లు అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి కాస్త సమయం దొరకడంతో భారత్ గెలవాలని కోరుకుంటున్నట్లు యువీ ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీసేన న్యూజిలాండ్ను కచ్చితంగా ఓడించాలని, టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా ఉందన్నాడు. బౌలింగ్ పరంగా ఇరు జట్లూ సమానంగా ఉన్నాయని తెలిపాడు. అయితే, భారత ఆటగాళ్లు ఐపీఎల్ ఆడి నేరుగా టెస్టు క్రికెట్ ఆడాలంటే కాస్త కష్టమని సందేహం వెలిబుచ్చాడు. పరిస్థితులకు బాగా అలవాటు పడితేనే అక్కడి పిచ్లను అర్థం చేసుకునే వీలు ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ఇండియా నేరుగా టెస్టు క్రికెట్ ఆడటం అంత తేలిక కాదని చెప్పాడు. మరోవైపు న్యూజిలాండ్ ఇంగ్లాండ్తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో ఆ జట్టుకు కాస్త ఎక్కువ అవకాశాలున్నాయన్నాడు. ఇదిలా ఉండగా, టీమ్ఇండియా ఇప్పటికే సౌథాంప్టన్ చేరుకొని హోటల్లో మూడు రోజుల కఠిన క్వారంటైన్ కూడా పూర్తిచేసుకోనుంది. దాంతో రేపటి నుంచి సుమారు పది రోజులు నెట్స్లో తీవ్రంగా సాధన చేసే అవకాశం లభించింది. మరి యువీ ఆశించినట్లు కోహ్లీసేన కివీస్ను ఓడిస్తుందో లేదో అప్పటిదాకా వేచి చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా