David Miller: 3, 4 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది: డేవిడ్ మిల్లర్
అండర్ డాగ్స్గా అడుగుపెట్టి ట్రోఫీ సాధించడం గొప్పగా ఉందని, ఇది తనకు మధురజ్ఞాపకంగా నిలిచిపోతుందని గుజరాత్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ డేవిడ్ మిల్లర్ హర్షం వ్యక్తం చేశాడు...
(Photo: David Miller Instagram)
ఇంటర్నెట్డెస్క్: అండర్ డాగ్స్గా అడుగుపెట్టి ట్రోఫీ సాధించడం గొప్పగా ఉందని, ఇది తనకు మధురజ్ఞాపకంగా నిలిచిపోతుందని గుజరాత్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ డేవిడ్ మిల్లర్ హర్షం వ్యక్తం చేశాడు. గతరాత్రి రాజస్థాన్తో జరిగిన తుదిపోరులో అతడు (32 నాటౌట్; 19 బంతుల్లో 3x4, 1x6) మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగిన సంగతి తెలిసిందే. అంతకుముందు లీగ్ స్టేజ్లోనూ పలు మ్యాచ్ల్లో ఫినిషర్గా వచ్చి దంచికొట్టాడు. దీంతో గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఫైనల్ మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్తో మాట్లాడిన మిల్లర్.. ఈ సీజన్లో తాను రాణించడానికి బాగా కష్టపడ్డానని చెప్పాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు 3-4 ఏళ్లుగా ప్రత్యేకంగా సన్నద్ధమైనట్లు తెలిపాడు. ‘ఈ టోర్నీలో నేను చాలాసార్లు విఫలమయ్యాను. దాంతో ఈసారి ఎలాగైనా రాణించాలని నిర్ణయించుకున్నా. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. పరిస్థితులకు అనుగుణంగా ఆటను మార్చుకుంటూ.. రన్రేట్ను సమన్వయం చేసుకోవడం అంత తేలిక కాదు. అలాంటప్పుడు మైదానంలో ప్రశాంతంగా ఉంటూ నాపని నేను చేసుకుపోవాలని అనుకున్నా. అయితే, ఈ సీజన్లో నేను బాగా ఆస్వాదించింది స్పిన్ బౌలింగ్ని. దాన్ని సమర్థంగా ఎదుర్కొన్నా. ఈ విషయంలో కొంతకాలంగా కష్టపడుతున్నా. నా బ్యాటింగ్లో మార్పులు చేసుకొని ఇప్పుడు విజయం సాధించా’ అని మిల్లర్ చెప్పుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..