Zealandia: కొత్తా ఖండమండీ!
గోండ్వానా విడిపోవటం మొదలైనప్పుడు జీలాండియా, ఆస్ట్రేలియా కలిసే ఉండేవి. అనంతరం ఆస్ట్రేలియా నుంచి విడిపోయి జీలాండియా ఏర్పడింది. దీని భూభాగం సముద్రంలో నెమ్మదిగా మునిగి పోతున్నప్పుడు ఆకారమూ మారుతూ వచ్చింది.
విడిపోయిందిలా..
గోండ్వానా విడిపోవటం మొదలైనప్పుడు జీలాండియా, ఆస్ట్రేలియా కలిసే ఉండేవి. అనంతరం ఆస్ట్రేలియా నుంచి విడిపోయి జీలాండియా ఏర్పడింది. దీని భూభాగం సముద్రంలో నెమ్మదిగా మునిగి పోతున్నప్పుడు ఆకారమూ మారుతూ వచ్చింది. పైకి తేలిన చిన్న ద్వీపాలన్నీ కలిసి చివరికి న్యూజిలాండ్లో భాగమయ్యాయి.
చుట్టుపక్కల ప్రాంతం కన్నా ఎత్తుగా ఉండటం, ప్రత్యేకమైన భూ స్వభావం, చుట్టుపక్కల సముద్రపు అడుగు కన్నా భూభాగం పైపొర మందంగా ఉండటం, నిర్దిష్టమైన ప్రాంతం.. ఇవన్నీ జీలాండియాను ఖండంగా గుర్తించేలా చేశాయి.
జీలాండియా(Zealandia) విస్తీర్ణం సుమారు 49 లక్షల కిలోమీటర్లు. రెండో సూక్ష్మ ఖండమైన మడగాస్కర్ కన్నా ఆరు రెట్లు పెద్దది.
అమెరికాకు చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్త బ్రూస్ పీటర్ లుయెండీక్ 1995లో జీలాండియా భావనను, పేరును ప్రతిపాదించారు.
ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పమైన అరేబియా ద్వీపకల్పం, భారత ఉపఖండం కన్నా జీలాండియా చాలా పెద్దది. సూక్ష్మ ఖండం కన్నా ఖండంగా గుర్తించటానికి అన్ని అర్హతలు జీలాండియాకు ఉన్నాయని ధ్రువీకరించారు.
అది 1820. రష్యా నౌకలో ప్రయాణిస్తున్నవారికి దూరంగా భారీ మంచు దిబ్బ కనిపించింది. అదే అంటార్కిటికా ఖండం. అక్కడి నుంచీ ఆధునిక ఏడు ఖండాల భావన స్థిరపడిపోయింది. పాఠాల్లో ఇదే చదువుకుంటున్నాం. యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా.. ఇలా ప్రపంచాన్నంతా ఖండాలుగా ఖాయం చేశారు. కానీ 2017లో కథ అనూహ్య మలుపు తిరిగింది. జీలాండియా అనే కొత్త ఖండం ప్రవేశంతో ఏడు ఖండాల సిద్ధాంతం ప్రమాదంలో పడింది. ఆస్ట్రేలియాకు ఆగ్నేయాన ఉండే ఇది ఎనిమిదో ఖండమనే భావన పురుడు పోసుకుంది. దీన్నే టి రియూ-ఎ-మాయూ లేదా టాస్మాంటిస్ అనీ అంటారు. నిజానికి శాస్త్రవేత్తలు చాలాకాలంగా జీలాండియా ఉనికిని ఊహిస్తూనే వస్తున్నప్పటికీ 375 సంవత్సరాలుగా ఇది అదృశ్యంగానే ఉంది. ఎందుకంటే ఇది 94% వరకు పసిఫిక్ మహా సముద్రంలో.. 1 నుంచి 2 కిలోమీటర్ల లోతున మునిగిపోయి ఉంటుంది మరి. మిగతా ఆరు శాతమే పైకి కనిపిస్తుంది. న్యూజిలాండ్.. దాని చుట్టుపక్కలుండే న్యూ క్యాలెడోనియా, నార్ఫోక్ ఐలాండ్, లార్డ్ హోవె ఐలాండ్ దీని మీదే ఉన్నాయి. క్రమంగా జీలాండియా గుట్టు బట్టబయలవుతోంది. భూ విజ్ఞాన, భూకంప శాస్త్రవేత్తలతో కూడిన అంతర్జాతీయ బృందం సముద్రంలోంచి సంగ్రహించిన రాళ్లు, అవక్షేపాల నమూనాలను పరిశీలించి జీలాండియా పటాలను తిరిగి రూపొందించింది. తొలి క్రెటేషియస్ యుగానికి సంబంధించిన అతి పురాతన గులక రాళ్ల దగ్గరి నుంచి చివరి క్రెటేషియస్ యుగానికి చెందిన ఇసుక రాళ్లు, ఎరోజన్ కాలానికి చెందిన లావా రాళ్లను నిశితంగా పరిశీలించింది. వీటి స్వభావాలు దక్షిణ అంటార్కిటికా భూభాగం తీరుతెన్నులతో పోలి ఉన్నట్టు గుర్తించింది. దీని ఆధారంగా న్యూజిలాండ్ దక్షిణ తీరంలోని క్యాంప్బెల్ పీఠభూమి సమీపంలో అదృశ్య భూభాగం ఆచూకీని పసిగట్టింది. సమగ్ర వివరాలతో జీలాండియా కొత్త పటాన్ని రూపొందించింది. ఈ పటంలో భూమి ఎత్తు పల్లాల వంటి వివరాలనూ పొందుపరచటం విశేషం. ఈ క్రమంలోనే జీలాండియా ఎలా ఏర్పడింది? 2.5 కోట్ల ఏళ్లుగా సముద్రపు అలల కిందే ఎందుకు ఉండిపోయింది? అనే రహస్యాలకు సంబంధించిన సూచనలు సైతం బయట పడ్డాయి.
ఖండాలు ఎనిమిది.
అదేంటి? ఏడే కదా?
అది నిజమే గానీ కొత్తగా వీటికి మరో ఖండం జత చేరనుంది.
పేరేంటో?
జీలాండియా.
ఇప్పటివరకూ ఎక్కడుంది?
సముద్రపు నీటిలో దాగుంది.
ఇప్పుడే బయటపడిందా?
ఇంకా సముద్రం అడుగుననే ఉంది. దీని గురించి ఇంతకుముందే తెలుసు. చాలాకాలంగా శాస్త్రవేత్తలు దీని ఉనికిని ఊహిస్తున్నారు. కాకపోతే ఇటీవలే కొత్త పటాన్ని రూపొందించారు.
మరి దీని వివరాలు, విశేషాలేంటి?
కోట్ల ఏళ్ల క్రితం
జీలాండియా సుమారు 8.3 కోట్ల సంవత్సరాల క్రితం.. చివరి క్రెటేషియస్ యుగంలో ఏర్పడింది. అయితే దీని ప్రస్థానం అంతకన్నా ముందే మొదలైంది. అప్పట్లో మన భూభాగమంతా ఒకే ముద్దలా ఉండేది. దీన్నే గోండ్వానా మహా ఖండంగా పిలుచుకుంటారు. ఇది విడిపోయి, విస్తరిస్తూ ఖండాలుగా ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతి చిన్న, పలుచటి, కొత్త జీలాండియా ఖండం పుట్టుకొచ్చింది. సుమారు 10 కోట్ల ఏళ్ల క్రితం అంటార్కిటికా నుంచి, సుమారు 8 కోట్ల ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా నుంచి విడిపోయిందని భావిస్తున్నారు. అప్పట్లో కొంతకాలమిది పూర్తిగా లేదా కొంత భాగం ద్వీపంగా ఉండేదని అనుకుంటున్నారు. అయితే 2.5 కోట్ల సంవత్సరాల క్రితం మహా సముద్రం నీటిలో మునిగిపోయింది. పైకి కనిపించే న్యూజిలాండ్ దీనిలో భాగమేననే భావన 2002లో పురుడు పోసుకుంది. నీటి లోతును తెలిపే బ్యాతీమెట్రీ అధ్యయనంతో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే జీలాండియాకు మీదున్న సముద్రం లోతు తక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో ఇది మహా సముద్ర భూ ఫలకాలకు సంబంధించింది కాదని, ఖండ భూ ఫలకాలతో ముడిపడినది కావొచ్చనే భావన బలపడింది. సాధారణంగా మహా సముద్ర భూ ఫలకాల రాళ్లు పలుచగా ఉంటాయి. కానీ జీలాండియా రాళ్లు మందంగా ఉండటం, రాళ్లలోని అంశాలు భిన్నంగా ఉండటంతో దీన్ని కొత్త ఖండంగా భావించాలని ప్రతిపాదించారు. అయితే 94% నీటి అడుగున ఉండిపోవటమే పెద్ద చిక్కుగా మారింది. దశాబ్దం పాటు పరిశోధనలు చేసినా ఇది మొదట్లో ఎలా ఏర్పడిందనేది రహస్యంగానే మిగిలిపోయింది. దీని గుట్టు తేలకపోవటానికి ప్రధాన కారణం- గోండ్వానా నుంచి విడిపోయినప్పుడు ఏర్పడిన
విచిత్రమైన ఘటనే.
సాగటంతో పలుచగా
అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం 2019లో జీలాండియా దక్షిణ భాగాన్ని పటంగా రూపొందించింది. వీరి పరిశోధనలో ఒక చిత్రమైన విషయం బయటపడింది. జీలాండియా ఏదో ఒక సమయంలో భూఫలకాల బలాల మూలంగా సాగిపోయిందని తేలింది. ఫలితంగా మిగతా ఖండాల మాదిరిగా కాకుండా పలుచటి ఖండంగా మారింది. అంతేకాదు.. పగుళ్ల మూలంగా సముద్రపు అడుగు పైపొరగా ఏర్పడింది. ఈ క్రమంలో వంపులు తిరిగింది. జీలాండియా అసలు రూపాన్ని తెలుసు కోవటంలో ఇదే సవాలుగా మారింది.
రాళ్ల తీరు, అయస్కాంత లోపాలతో..
తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఉత్తర జీలాండియా ప్రాంతం నుంచి పురాతన రాళ్లను సేకరించి, విశ్లేషించి వాటి వయసును లెక్కించారు. అతి పురాతన గులకరాళ్లు తొలి క్రెటాషియస్ (సుమారు 13-11 కోట్ల ఏళ్ల క్రితం) యుగానికి.. ఇసుక రాళ్లేమో చివరి క్రెటాషియస్ (సుమారు 9.5 కోట్ల ఏళ్ల క్రితం) చెందినవని గుర్తించారు. లావా గడ్డకట్టం వల్ల ఏర్పడిన రాళ్లు ఈయూసీన్ (సుమారు 4 కోట్ల ఏళ్ల క్రితం) కాలానికి సంబంధించినవని తేల్చారు. వాయువ్యం నుంచి ఆగ్నేయం వరకూ భూభాగం చాలా చోట్ల వేర్వేరుగా ఉండటం, పశ్చిమ అంటార్కిటికా భూ స్వభావానికి సరిపోవటం మూలంగా ఈ ప్రాంతం ఒకప్పుడు జీలాండియాతో కలిసి ఉండేదనే నిర్ణయానికి వచ్చారు. జీలాండియా చుట్టుపక్కల సముద్రం అడుగున అయస్కాంత లోపాలనూ శాస్త్రవేత్తలు లెక్కించారు. భూ అయస్కాంత క్షేత్ర బలంలో ఏర్పడే తేడాలు ఖండ భూఫలకాలు ఎలా కదిలాయనే దాన్ని సూచిస్తాయి. వీటి ఆధారంగానే జీలాండియా సాగిన తీరును శాస్త్రవేత్తలు అంచనా వేయగలిగారు. ఇది లక్షలాది సంవత్సరాల పాటు సాగటమే కాదు, దీని దిశ కూడా మారటం గమనార్హం. ఇలా జీలాండియా రహస్యాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. చాలాభాగం సముద్ర ఉపరితలానికి కిలోమీటర్ల లోతులో ఉండటం వల్ల అన్ని రహస్యాలూ తేలటానికి ఇంకాస్త సమయం పట్టొచ్చు.
భారత ఉపఖండం కన్నా పెద్దది
భూమి పైపొర మందం, సాంద్రత వంటి వివిధ స్వభావాలను పరిగణనలోకి తీసుకొని చూస్తే ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పమైన అరేబియా ద్వీపకల్పం, భారత ఉపఖండం కన్నా జీలాండియా చాలా పెద్దది. సూక్ష్మ ఖండం కన్నా ఖండంగా గుర్తించటానికి అన్ని అర్హతలు జీలాండియాకు ఉన్నాయని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జియాలజిస్టులు ధ్రువీకరించారు. దీని విస్తీర్ణం సుమారు 49 లక్షల కిలోమీటర్లు. ఇది మడగాస్కర్ కన్నా ఆరు
రెట్లు పెద్దది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
కంప్యూటర్కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత