Air India: ఆంగ్లేయ అడ్డుపుల్లలు.. ఐనా ఎగిరిన టాటా!
భారత్ను అన్నింటా అణగదొక్కాలని చూసిన బ్రిటిష్ ప్రభుత్వం 1932లోనే టాటాలను ఎలా ఎగరనిచ్చింది? నిజానికి అదేమంత సులభంగా సాధ్యం కాలేదు. ఆంగ్లేయుల ఎన్నో అడ్డుపుల్లల్ని ఛేదించుకుంటూ... పట్టుబట్టి మరీ టాటాలు ఎయిర్లైన్స్కు అనుమతి పొందారు. ఆంగ్లేయులకే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు.
భారత్ను అన్నింటా అణగదొక్కాలని చూసిన బ్రిటిష్ ప్రభుత్వం 1932లోనే టాటాలను ఎలా ఎగరనిచ్చింది? నిజానికి అదేమంత సులభంగా సాధ్యం కాలేదు. ఆంగ్లేయుల ఎన్నో అడ్డుపుల్లల్ని ఛేదించుకుంటూ... పట్టుబట్టి మరీ టాటాలు ఎయిర్లైన్స్కు అనుమతి పొందారు. ఆంగ్లేయులకే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు.
భారత్లో గగనయానం తొలిసారిగా 1911లో చోటు చేసుకుంది. 23 ఏళ్ల ఫ్రెంచ్ పైలెట్ హెన్రీ పీక్యూ ఇనుప వైర్లు కట్టిన చెక్క ఫ్రేమ్తో కూడిన హంబర్ బైప్లేన్ను అలహాబాద్లోని పోలో గ్రౌండ్ నుంచి నైని జంక్షన్ దాకా ఎగిరించారు. 6500 ఉత్తరాలను ఈ విమానం మోసుకొని వచ్చింది. 10 కిలోమీటర్ల ఈ దూరాన్ని చేరటానికి 13 నిమిషాలు పట్టింది.
ఆ తర్వాత 20 సంవత్సరాల పాటు ఇలా ఉత్తరాల విమానాలు అడపాదడపా నడిచాయి. 1929లో బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన ఇంపీరియల్ ఎయిర్వేస్ భారత్కు సేవలను మొదలెట్టింది. లండన్ నుంచి కరాచీకి తొలి విమానం 20 చోట్ల ఆగుతూ 6-7 రోజుల్లో చేరుకుంది.
అదే ఏడాది... భారత తొలి ఫ్లయింగ్ క్లబ్ ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా-బర్మా ఆరంభమైంది. ఈ క్లబ్ ద్వారా... టాటా యువ వారసుడు జేఆర్డీ టాటా పైలెట్ లైసెన్స్ పొందారు. విదేశాల్లో విమాన పోటీల్లో పాల్గొని ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న ఆయనకు బ్రిటిష్ విమానయాన నిపుణుడు, మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున యుద్ధ విమానాలు నడిపిన నెవిల్ విన్సెంట్ పరిచయమయ్యారు. భారత్లో విమానయానానికి మంచి భవిష్యత్ ఉందని ఊహించిన విన్సెంట్ తొలుత భారత్లోని ప్రముఖ పారిశ్రామికవేత్త సర్ హోమీ మెహతాను కలిశారు. కానీ ఆయన తిరస్కరించారు. దీంతో... టాటాలను సంప్రదించారు. యువకుడే కాకుండా పైలెట్ లైసెన్స్తో ఉరకలెత్తుతున్న జేఆర్డీ తమ సంస్థ ఛైర్మన్ సర్ దొరాబ్జి టాటా వద్దకు ఈ ప్రతిపాదన తీసుకెళ్లారు. తొలుత అంతగా ఆసక్తి చూపని ఆయన... చివరకు విన్సెంట్ మాటలకు అంగీకరించారు. రూ.2లక్షల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు.
వెంటనే దేశంలో ఎయిర్లైన్స్ ఆరంభించటానికి అనుమతులు కోరుతూ టాటాలు బ్రిటిష్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ తమ ఇంపీరియల్ ఎయిర్లైన్స్ సేవల్నే విస్తరించాలనుకున్న ఆంగ్లేయులు అనుమతులివ్వకుండా నాన్చసాగారు. మూడేళ్లపాటు కొర్రీలు పెడుతూ వచ్చారు. విన్సెంట్ మళ్ళీ రంగంలోకి దిగారు. బ్రిటిష్ బ్యూరోక్రసీని దాటి... ఏకంగా వైస్రాయ్తో తేల్చుకోవటానికి సిద్ధపడ్డారు. సిమ్లా విడిదిలో ఉన్న లార్డ్ విలింగ్టన్ దగ్గరకు స్వయంగా వెళ్లారు. దొరాబ్జిని ఒప్పించినట్లే... వైస్రాయ్నూ ఒప్పించారు. 1932 ఏప్రిల్ 24న పదేళ్ల ఒప్పందంతో అనుమతులు లభించాయి. టాటా ఎయిర్మెయిల్ ఆవిర్భవించింది. 1932 అక్టోబరు 15న కరాచీ నుంచి ముంబయికి తొలి టాటా విమానం గాల్లోకి ఎగిరింది. దాని సగటు వేగం గంటకు 80 కి.మీ. జేఆర్డీ టాటా తానే స్వయంగా పైలెట్గా వ్యవహరించారు. ఆ కాలంలో కరాచీ నుంచి ముంబయికి రైల్లో 45 గంటల సమయం పట్టేది. టాటా విమానం 8గంటల్లోపే చేరుకుంది. అహ్మదాబాద్లో ఆగినప్పుడు బర్మా షెల్ పెట్రోల్ డబ్బాలను ఎద్దుల బండిపై రన్వే వద్దకు తీసుకొచ్చి విమానంలోకి నింపారు. తర్వాత ముంబయి నుంచి బళ్లారి మీదుగా మద్రాసుకు బయల్దేరింది. అలా... వారానికోసారి కరాచీ నుంచి మద్రాసుకు టాటా ఎయిర్ మెయిల్ కొనసాగింది.
అలా తొలుత ఉత్తరాలకు పరిమితమైన విమానంలో తర్వాత ప్రయాణికులను కూడా కూర్చోబెట్టడం మొదలెట్టారు. ఉత్తరాల బ్యాగులపైనే కూర్చొని ప్రయాణం చేయాల్సి వచ్చేది. రెండో ప్రపంచయుద్ధం కారణంగా 1939లో భారత్లో పౌరవిమానాలను రద్దు చేశారు. వీటన్నింటినీ బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. యుద్ధ అవసరాలకు వాడుకుంది. ఈ సమయంలోనే భారత్లో ఎయిర్క్రాఫ్ట్ ఫ్యాక్టరీ ఆరంభించాలని టాటాలు యోచించారు. విన్సెంట్ మళ్లీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ యుద్ధసమయంలో (1942) ఆయన ప్రయాణిస్తున్న బాంబర్ విమానం మార్గమధ్యలోనే మాయమైంది. ఫ్రాన్స్ సమీపంలో విన్సెంట్ విమానాన్ని కూల్చేశారని తర్వాత తేలింది. టాటాలు తమ ప్రియ మిత్రుడికి బరువైన గుండెలతో వీడ్కోలు పలికి... ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లటంలో మునిగిపోయారు. భారత కీర్తి పతాకను గగనంలో ఎగరేశారు.
శభాష్ టాటా
విన్సెంట్ నైపుణ్యం... టాటాల క్రమశిక్షణ కారణంగా... తొలి ఏడాదిలోనే సమయపాలనలో నూటికి నూరుశాతం విజయం సాధించటం టాటా ఎయిర్మెయిల్ ఘనత. ‘‘ఎయిర్మెయిల్ సర్వీస్ను ఎలా నడపాలనే దానికి టాటాలు ఆదర్శంగా నిలుస్తున్నారు. బ్రిటిష్ ఇంపీరియల్ ఎయిర్వేస్ సిబ్బందిని టాటాల వద్దకు కొద్దికాలం పంపించి శిక్షణ ఇప్పించాలి’’ అని 1933-34లో డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తన నివేదికలో కితాబిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?