ప్రాంతానికో సెల్ఫోన్.. రాష్ట్రానికో నంబరు ప్లేటు
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణాపై నిఘా విస్తృతం కావడంతో వ్యవస్థీకృత ముఠాలు పంథా మార్చుకుంటున్నాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సరకును గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి.
గంజాయి ముఠాల ఎత్తుగడలు
సమాన వాటా ఇచ్చేలా డ్రైవర్లతో ఒప్పందాలు
ఈనాడు, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణాపై నిఘా విస్తృతం కావడంతో వ్యవస్థీకృత ముఠాలు పంథా మార్చుకుంటున్నాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సరకును గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. దర్యాప్తు బృందాల కంట పడకుండా గమ్యానికి చేరుకునే లారీ డ్రైవర్లకు భారీగా నజరానాలు ప్రకటించడం.. ప్రాంతానికో సెల్ఫోన్, నంబరు ప్లేటు వాడటం, సొంత చెక్పోస్టుల ఏర్పాటు వంటి అనేక వ్యూహాలు అనుసరిస్తున్నట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని విశాఖ ఏజెన్సీ సీలేరు నుంచి మహారాష్ట్రలోని ఉస్మానాబాద్కు 1820 కిలోల గంజాయిని తరలిస్తున్న ముఠా రాచకొండ ఎస్వోటీ బృందానికి రెండు రోజుల క్రితం చిక్కింది. విచారణలో ముఠా కార్యకలాపాల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పట్టుకునేందుకు అవకాశం ఉండటంతో డ్రైవర్లు, సహా ముఠా సభ్యులు ఫోన్ నంబర్లను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారని గుర్తించారు. సీలేరులో గంజాయి నింపుకోగానే అప్పటివరకు మాట్లాడిన ఫోన్లను అక్కడే పడేస్తున్నట్టు, విశాఖ వరకు మరొకటి, ఆ తర్వాత హైదరాబాద్ శివార్ల వరకు ఇంకోఫోన్ను వినియోగిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు.
పశ్చిమబెంగాల్, కర్ణాటక, దిల్లీ వాహనాలు
రవాణాకు వినియోగించే వాహనాల విషయంలోనూ స్మగ్లర్లు తెలివిగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమబెంగాల్, కర్ణాటక, దిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన వాహనాలనే వినియోగిస్తున్నారు. వాటికి నకిలీ నంబరు ప్లేట్లను తగిలిస్తున్నారు. ఏపీ దాటే వరకు ఆ రాష్ట్రానిది, తెలంగాణలోకొచ్చాక ఇక్కడిది బిగిస్తున్నారు. ‘తాజాగా 1820 కిలోల గంజాయిని తరలిస్తూ పట్టుబడిన లారీ పశ్చిమబెంగాల్కు చెందినదని, దానికి ఏపీ నంబరు ప్లేటు వాడినట్లు గుర్తించామని’ గంజాయి నియంత్రణ కేసుల్ని పర్యవేక్షిస్తున్న ఓ అధికారి తెలిపారు. ‘ఈ ముఠాలోని మిగిలిన సభ్యులంతా మహారాష్ట్రకు చెందిన వారే. డ్రైవర్ రషీదుల్ మాత్రం పశ్చిమబెంగాల్ వాసి. ఏవోబీ నుంచి తరచూ గంజాయిని తరలించే ఇతడికి ముఠాసభ్యులు భారీ నజరానా ప్రకటించినట్లు దర్యాప్తులో తేలింది. సాధారణంగా ఏవోబీ నుంచే దేశంలోని 14 రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతోంది. ఇందుకుగానూ లారీల డ్రైవర్లకు ట్రిప్పు ఒక్కింటికి రూ.50వేల వరకు ముట్టజెబుతారు. దూరం పెరిగితే మరింత ఎక్కువ ఇస్తారు. ఉస్మానాబాద్ ట్రిప్పులో మాత్రం రషీదుల్కు విక్రయించిన అనంతరం వచ్చిన లాభాల్లో సమాన వాటా ఇస్తానని ఆశ చూపారు’ అని ఆయన వెల్లడించారు.
సొంతంగా 3 చెక్పోస్టులు
కఠినంగా వ్యవహరిస్తున్న తెలంగాణ పోలీసుల కళ్లు గప్పేందుకు స్మగ్లర్లు సూర్యాపేట, పంతంగి, అబ్దుల్లాపూర్మెట్లలో మూడు ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడున్న తమ సంబంధీకులు అనుమతి ఇస్తేనే వాహనాన్ని ముందుకు కదిలించేలా డ్రైవర్లకు సూచిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా మరమ్మతుల పేరిట పక్కన ఆపేస్తున్నారు. ‘‘పటాన్చెరు దాటితే గంజాయి తరలింపు ముఠాలను పట్టుకోవడం సాధ్యం కాదు. అక్కడి నుంచి లోడ్తో ఉన్న వాహనాలు అసలు సూత్రధారుల చేతుల్లోకి వెళ్తాయి. అందుకే ఉమ్మడి నల్గొండ జిల్లా పంతంగి నుంచి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ వరకు డేగకళ్లతో జల్లెడ పడుతున్నామని’ ఓ దర్యాప్తు అధికారి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి
శంషాబాద్ విమానాశ్రయ రన్వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. -
వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. -
సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. పదోన్నతులకు టెట్ మినహాయింపునిస్తాం
తెలంగాణలో 2010 కన్నా ముందు నియమితులై 1 నుంచి 5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఛైర్మన్ యోగేశ్ సింగ్ తెలిపారు. -
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. -
6న ఈసెట్
టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు
ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై మినహాయింపు
దూరప్రాంత బస్ సర్వీసుల్లో రిజర్వేషన్ ఛార్జీలపై టీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. -
40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. -
హెచ్సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?