తప్పదు ‘పరీక్ష’.. నీకు నీవే రక్ష!
ఇప్పుడు కరోనా మూడోవేవ్ నడుస్తోంది. వైరస్ సోకిందా లేదా అని తనిఖీ మొదలు దాని నుంచి బయట పడేందుకు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కువ మంది జ్వరం, దగ్గు, గొంతునొప్పులతో ఇబ్బంది పడుతున్నారు.
ఇంట్లో ఈ పరికరాలు ఉన్నాయా?
జ్వరం.. బీపీ.. పల్స్.. ఆక్సిజన్ స్థాయులు తెలుసుకోండి
వేపరైజర్లను సిద్ధం చేసుకోండి
న్యూస్టుడే, కేపీహెచ్బీకాలనీ
ఇప్పుడు కరోనా మూడోవేవ్ నడుస్తోంది. వైరస్ సోకిందా లేదా అని తనిఖీ మొదలు దాని నుంచి బయట పడేందుకు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కువ మంది జ్వరం, దగ్గు, గొంతునొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. కొవిడ్ సోకిందా లేదా అనే అనుమానంతో సతమతమవుతున్నారు. జ్వరం మూడ్రోజుల్లో తగ్గకపోతే పరీక్ష తప్పదు. కిట్తో స్వీయ తనిఖీ కూడా చేసుకోవచ్చు. పాజిటివ్ అని తేలితే నిత్యం కొన్ని పరికరాలతో కుస్తీ పట్టాల్సిన అవసరం ఉంది. జ్వరం, రక్తపోటు, పల్స్, ఆక్సిజన్ స్థాయి, ఆవిరిపట్టుకోవడం..ఇలా అన్నింటికీ పరికరాలున్నాయి. కంపెనీలను బట్టి.. మార్కెట్, ఆన్లైన్ ధరలను బేరీజు వేసుకుని నాణ్యమైన వాటిని కొనుగోలు చేసి ప్రాథమిక చికిత్స చేసుకోవాలి. పరిస్థితి విషమిస్తే ఆసుపత్రికి వెళ్లాల్సిందే.
థర్మల్ స్క్రీన్
ఎందుకంటే : మామూలు థర్మామీటర్, ఈ థర్మల్స్క్రీన్ పనితీరు ఒకటే. థర్మామీటర్ను చంకలో లేదా నాలిక కింద ఉంచి శరీర ఉష్ణోగ్రత కొలుస్తారు. కరోనా నేపథ్యంలో ఒకరు వాడిన థర్మామీటర్ను మరొకరు వాడటం శ్రేయస్కరంకాదు.
ఎలా పనిచేస్తుంది : థర్మల్స్క్రీన్లోని ఇన్ఫ్రా రెడ్ లైట్ 5 సెం.మీ. దూరం నుంచే శరీరంలోని ఉష్ణోగ్రతను చూపిస్తుంది. సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ లేదా 98.7 ఫారెన్హీట్ దాటిందంటే అప్రమత్తమవ్వాలి.
మార్కెట్ ధర : రూ.750-రూ.3 వేల వరకు. (కంపెనీ ఆధారంగా సర్జికల్ దుకాణం ధర)
ఆన్లైన్ రేటు : రూ.800-రూ.2000 వరకు. రూ.50 వేలకుపైగా ధర పలికేవీ ఉన్నాయి. వీటిని కంప్యూటర్కి కూడా లింక్ చేసుకోవచ్చు.
పల్స్ ఆక్సీమీటర్
ఎందుకంటే : నాడి (పల్స్), శరీరంలోని ఆక్సిజన్ శాతం (ఆక్సీ) తెలుసుకునేందుకు
ఎలా పనిచేస్తుంది : ఈ పరికరంలోని లైట్ సోర్స్ ద్వారా శరీరంలోని ఆక్సిజన్ శాతం, నాడి, గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలుసుకోవచ్చు.
పల్స్ సాధారణ స్థాయి : నిమిషానికి 72 సార్లు. రోగి పరిస్థితిని బట్టి కొందరిలో 72-80-90 వరకు... జ్వరం వచ్చిన వారిలో 100 వరకు కూడా ఉంటుంది.
ఆక్సిజన్ శాతం సాధారణ స్థాయి : ఆరోగ్యవంతులకు 95-100. ఛాతీ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కొంత తక్కువ కూడా ఉండొచ్చు. 95 కంటే తక్కువైతే వైద్యుడిని సంప్రదించాలి
మార్కెట్ ధర : రూ.950-రూ.2500 వరకు. (కంపెనీ ఆధారంగా సర్జికల్ దుకాణం ధర)
ఆన్లైన్ ధర : రూ.500-రూ.2 వేల వరకు
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్
ఎవరు వాడాలి : శరీరంలో ఆక్సిజన్ శాతం 95 కంటే బాగా తక్కువగా ఉంటే ఈ పరికరాన్ని వాడాలి.
ఎలా పనిచేస్తుంది : ఈ పరికరంలో ఉంటే బాక్సులో పోసిన నీటికి.. అప్పటికే యంత్రానికి విద్యుత్తు సరఫరా ద్వారా ఏర్పడే గాలి తోడై శరీరానికి కాన్సన్ట్రేటర్ స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తుంది. అవసరమైతే అద్దెకు తెచ్చుకోవచ్చు. లేదంటే కొనుగోలు చేయొచ్చు.
కిరాయి : నెలకు రూ.2వేలు-రూ.5 వేల వరకు (యంత్ర సామర్థ్యాన్ని బట్టి)
మార్కెట్ ధర: రూ.35 వేలు-రూ.1.50 లక్షల వరకు. (కంపెనీ ఆధారంగా.. సామర్థ్యాన్ని బట్టి సర్జికల్ దుకాణం ధర)
ఆన్లైన్ ధర: రూ.15 వేలు-రూ.1.75 లక్షల వరకు
డిజిటల్ రక్తపోటు యంత్రం
ఎందుకంటే : గతంలో బీపీ తనిఖీకి వైద్యుడి వద్దకే వెళ్లేవారు. ఇప్పుడు ఈ పరికరంతో ఎవరైనా ఇంట్లో పరీక్షించుకోవచ్చు.
ఎలా పనిచేస్తుంది : యంత్రానికి ఉన్న పైపు వస్త్రాన్ని చేతికి చుట్టినప్పుడు గుండె ధమనుల్లో ప్రవహించే రక్త వేగాన్ని ఈ యంత్రం గుర్తించి రక్తపోటు స్థాయిని తెలుపుతుంది.
సాధారణ స్థాయి : 120/80 (సిస్టాలిక్.. 120, డయాస్టాలిక్.. 80) ఉండాలి. కొంత హెచ్చుతగ్గులున్నా ఫరవాలేదు.
ప్రమాద స్థాయి: సిస్టాలిక్, డయాస్టాలిక్కంటే బాగా తక్కువ ఉంటే లోబీపీ, సిస్టాలిక్ 140 కంటే ఎక్కువ ఉంటే హైబీపీగా నిర్ధారిస్తారు.
మార్కెట్ ధర : రూ.1,100-రూ.3 వేల వరకు (కంపెనీ ఆధారంగా సర్జికల్ దుకాణం ధర)
ఆన్లైన్ ధర : రూ.800-రూ.3,500 వరకు
వేపరైజర్లు (ఆవిరి పట్టే పరికరాలు)
ఎందుకంటే: ఈ పరికరాలతో ఆవిరి పట్టుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఇందులో వేడినీళ్లు పోసి జిందాతిలిస్మాత్ వేస్తే వచ్చే ఆవిరితో వైరస్ నశిస్తుందని నిపుణులంటున్నారు. ముక్కు, చెవులు, గొంతు మార్గాల్లో వైరస్, బ్యాక్టీరియా నాశనమవుతుంది. ఎక్కువ ఆవిరి పట్టడం మంచిది కాదు.
మార్కెట్ ధర : రూ.200- రూ.3,000 వరకు. (కంపెనీ ఆధారంగా సర్జికల్ దుకాణం ధర)
ఆన్లైన్ ధర: రూ.200- రూ.800 వరకు
ర్యాట్ (ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్) కిట్
ఎలా పనిచేస్తుంది : ఈ కిట్లో 2 గీతలుంటాయి.ఒకటి కంట్రోల్. రెండోది టెస్ట్ గీత. ముక్కు, గొంతులో నుంచి తీసిన నమూనాను వీటీఎం - వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియా (ద్రావణం)లో కలపాలి. దీన్ని కిట్లో వేయాలి. శరీరంలో వైరస్ ఉంటే ఈ ద్రావణంలోనూ వైరస్ బతికే ఉంటుంది.
ఇలా తెలుస్తుంది: 2 గీతలు కనిపిస్తే పాజిటివ్.. 1 గీత కనిపిస్తే నెగెటివ్. (కంట్రోల్ గీత కనిపిస్తేనే కిట్ పనిచేస్తున్నట్లు)
మార్కెట్ ధర: రూ.200-రూ.3 వేల వరకు (కంపెనీ ఆధారంగా సర్జికల్ దుకాణం ధర)
ఆన్లైన్ ధర: రూ.200-రూ.4 వేలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM