మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా పోరాటం
కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపడమే లక్ష్యంగా భారత కమ్యునిస్టు పార్టీ(మార్కిస్టు) పోరాడుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటించారు. పార్టీ రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా శనివారం
భాజపాతో దేశానికి.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం
సీపీఎం మహాసభలో ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
ఈనాడు, హైదరాబాద్: కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపడమే లక్ష్యంగా భారత కమ్యునిస్టు పార్టీ(మార్కిస్టు) పోరాడుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటించారు. పార్టీ రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా శనివారం సాయంత్రం నిర్వహించిన ఆన్లైన్ మహాసభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ప్రజా ఉద్యమాలను బలపరచడం ద్వారానే ఇది సాధ్యం. పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో పార్టీశాఖలు నిర్ణయం తీసుకుంటాయి. కలిసి పోరాడితే ప్రజల్ని ఓడించగలిగేవారు లేరనేది ఇటీవల రైతు ఉద్యమం చాటిచెప్పింది. ప్రధాని మోదీ దిగిరాక తప్పలేదు. రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద, మత సామరస్యంపైన జరుగుతున్న దాడులను, దోపిడీని ఎదుర్కోవాలంటే ప్రజా ఉద్యమాలే సరైన మార్గం. దీనికోసం ఎలాంటి ఎత్తుగడ అనుసరించాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. దేశంలో అందరికీ రెండు డోసులు వ్యాక్సిన్ వేస్తే ప్రజలు కరోనా నుంచి బయటపడే అవకాశం ఉన్నా కేంద్రం చేతులు ఎత్తేసింది. దేశ సంపదంతా లూటీ అవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది. దేశంలో కోటీశ్వరుల వద్ద ఉన్న సంపద విలువ 55.5 శాతం దేశ ప్రజల సంపదతో సమానం. ప్రపంచ స్థాయి ప్రమాణాల ప్రకారం దేశంలో ఆకలి, పేదరికం సూచీలు పడిపోతున్నాయి. ఎనిమిదేళ్లలో సామూహిక అత్యాచారాలు, మహిళలపై దాడులు, హత్యలు చోటుచేసుకున్నా సరైన నివారణ చర్యలు లేవు. వ్యవసాయం, విద్య, సహకార, విద్యుత్ తదితర వ్యవస్థలపై రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు. పార్లమెంటును రబ్బరు స్టాంపుగా మార్చారు. సీబీఐ, ఈడీలను స్వార్థానికి వాడుకుంటూ ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయిస్తున్నారు’’ అంటూ సీతారాం ఏచూరి విమర్శించారు. పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కారాట్ మాట్లాడుతూ.. పోరాటాలతోనే ఏదైనా సాధ్యమనేది అంతా గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సీతారాములు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
పలు అంశాలపై చర్చ, తీర్మానాలు
భారత కమ్యునిస్టు పార్టీ(మార్క్సిస్టు) రాష్ట్ర మూడో మహాసభలు మంగళవారం వరకు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో నిర్వహించనున్న ఈ సభల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారాట్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు కేంద్ర కమిటీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల నుంచి 640 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభల్లో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమోదించనున్నారు.
ప్రజా తెలంగాణయే సీపీఎం లక్ష్యం
తెలంగాణ ఆవిర్భావం తరువాత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పాలకులు బంగారు తెలంగాణ నిర్మిస్తామని వాగ్దానం చేసినా నెరవేర్చలేదు. ప్రజా తెలంగాణ సాధించడం ఎలా అనేదానిపై పార్టీ ఆలోచన చేస్తోంది. కేంద్రంపై యుద్ధం ప్రకటించకపోతే ప్రజల ప్రయోజనాలకు రక్షణ కష్టం. కాంగ్రెస్ సరైన తీరులో స్పందించడం లేదు.
- బీవీ రాఘవులు, పొలిట్బ్యూరో సభ్యుడు
రాష్ట్రంలో విషసర్పంలా భాజపా
రాష్ట్రంలో భాజపా విషసర్పంలా ఎదుగుతోంది. దేశంతో పాటు ఈ రాష్ట్రంలోనూ సీపీఎంకు భాజపాయే ప్రధాన రాజకీయ శత్రువు. మరోమారు ప్రజాతంత్ర శక్తులను సమీకరిస్తాం. భాజపా దాడి కేవలం కమ్యునిస్టులపైనే కాదు తెరాసపైనా ఉంది. అయినా సీఎం కేసీఆర్ పోరాటం చేయడం లేదు. భాజపాతో బేరసారాలు ఆడుకోవడానికి అధికారాన్ని వాడుకుంటున్నారు. ఆయనతో ఎన్నికల పొత్తు పెట్టుకోం.
- తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.