Yadadri: అంగరంగ వైభవం.. అంకురార్పణం
అశేష భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశేష పర్వానికి అంకురార్పణం ఘనంగా జరిగింది. ఓ వైపు గలగలా గోదారి గండి చెరువుకు తరలిరాగా.. అత్యద్భుతంగా పునర్ నిర్మించిన యాదాద్రి ఆలయంలో స్వయంభువుల దర్శనానికి కీలకమైన మహాకుంభ
యాదాద్రి ఆలయ ఉద్ఘాటన పర్వానికి ఘనంగా మొదలైన క్రతువులు
ప్రధానార్చకుల పర్యవేక్షణలో 108 మంది రుత్వికులతో శ్రీకారం
నేడు ప్రారంభంకానున్న పంచకుండాత్మక మహాయాగం
ఈనాడు, నల్గొండ - న్యూస్టుడే, యాదగిరిగుట్ట: అశేష భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశేష పర్వానికి అంకురార్పణం ఘనంగా జరిగింది. ఓ వైపు గలగలా గోదారి గండి చెరువుకు తరలిరాగా.. అత్యద్భుతంగా పునర్ నిర్మించిన యాదాద్రి ఆలయంలో స్వయంభువుల దర్శనానికి కీలకమైన మహాకుంభ సంప్రోక్షణలో ఆదిపర్వాలు సోమవారం అంగరంగ వైభవంగా, శాస్త్రోక్తంగా మొదలయ్యాయి. ఆలయ ఉద్ఘాటన పర్వంలో భాగంగా నిర్వహిస్తున్న పంచకుండాత్మక యాగానికి ముందస్తుగా మహావిష్ణువు సర్వసేనాని అయిన విష్వక్సేన ఆళ్వారుడికి తొలిపూజ చేపట్టి బాలాలయంలో అంకురార్పణకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు స్వయంభువులు కొలువై ఉన్న ప్రధానాలయంలో వాస్తుదోష నివారణ, సుదర్శన హోమాది క్రతువులు చేపట్టారు. అనంతరం దివ్య విమానంపై ప్రతిష్ఠించనున్న శ్రీసుదర్శన స్వర్ణ చక్రానికి ప్రత్యేక పూజలు చేపట్టి మూలవరుల అనుమతి పొందారు. ఈ నెల 28 నుంచి మూలవరుల దర్శనాలకు తెరతీయనున్న నేపథ్యంలో ప్రధానాలయం ముఖమంటపంలోని ఉప ఆలయాల్లో మూర్తుల ప్రతిష్ఠ పర్వానికి పూజలు జరిపారు. అనంతరం బాలాలయంలో ఉదయం స్వస్తివచనం, రాత్రి అంకురార్పణ కైంకర్యాలను కొనసాగించారు. విష్వక్సేన ఆరాధనలో అగ్నిపూజ చేపట్టి జలాన్ని పూజించారు. ఆ నీటితో ఆలయ ప్రాంగణంతోపాటు యాగశాలను శుద్ధి చేశారు. స్వామి జన్మనక్షత్రం(స్వాతి) సందర్భంగా వేకువజామున బాలాలయంలో శ్రీ స్వామి ఉత్సవమూర్తులకు అష్టోత్తర శత కలశాలతో అభిషేకం నిర్వహించారు. ఈ క్రతువులన్నీ ఆలయ ప్రధానార్చకులు నల్లంథిగల్ లక్ష్మీనరసింహచార్య పర్యవేక్షణలో పాంచరాత్ర ఆగమ విధానాలతో కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు యాత్రికులను ఆహ్వానిస్తూ కొండ కింద స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. పట్టణంలో భక్తుల సౌకర్యార్థం తాగునీటి కేంద్రాలను నెలకొల్పారు.
యాగ పూజలు..
వారం పాటూ కొనసాగే పంచకుండాత్మక యాగ నిర్వహణకు బాలాలయంలో ఏర్పాటుచేసిన యాగశాలలో సంప్రోక్షణ పర్వాన్ని చేపట్టి కుండాలను సిద్ధం చేశారు. నలువైపులా ఏర్పాటైన కుండాల మధ్య శ్రీమహాలక్ష్మి కుండంలో నిర్వహించే యాగానికి సంబంధించి పర్యవేక్షకులకు బాధ్యతలు అప్పగించారు. నిరంతరం పారాయణ పఠనానికి 108 మంది రుత్వికులు సంసిద్ధులయ్యారు. మంగళవారం మొదలయ్యే పంచకుండాత్మక మహాయాగం నిర్వహణకు యాగశాలను సిద్ధం చేసి ద్రవ్యాలను చేర్చారు. శాంతిపాఠం, అవధారయాల పర్వాల్లో ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, ద్వారతోరణం క్రతువులు చేపట్టాక అగ్నిప్రతిష్ఠ, అగ్ని మథనంతో యాగం మొదలుకానుంది.
శివాలయ ఉద్ఘాటనకు యంత్రజపం
వచ్చే నెల 25న క్షేత్రంలోని పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయ ఉద్ఘాటన జరగనున్న నేపథ్యంలో సోమవారం యంత్ర జపం నిర్వహించారు. రాంపూర్ ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి సూచనలతో ఉద్ఘాటన పర్వానికి ముందస్తు కైంకర్యాలను చరమూర్తుల మందిరం(తాత్కాలిక ఆలయం)లో 13 మంది పూజారులు, వేదపండితులు, పురోహితులతో కొనసాగించారు.
గలగలా గోదారి
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ నుంచి యాదాద్రి క్షేత్రానికి మూడు రోజుల క్రితం నీటిని విడుదల చేయగా.. సోమవారం సాయంత్రం గండిచెరువుకు చేరుకున్నాయి. దీంతో గోదావరి జలాలను క్షేత్రానికి తీసుకురావాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరినట్లైంది. గండిచెరువు నిండిన తర్వాత అక్కడి నుంచి కొండ కింద లక్ష్మి పుష్కరిణి, కొండపైనున్న విష్ణు పుష్కరిణిలకు జలాలను తరలిస్తారు. ప్రభుత్వ పక్షాన స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత గోదావరి జలాలతో కూడిన బిందెను తీసుకొచ్చి పూజారులకు అప్పగించారు. మహాక్రతువు ప్రారంభం కావడంతో భద్రతా ఏర్పాట్ల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాచకొండ సీపీ మహేశ్ భగవత్, భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం