రాష్ట్రంలోకి యూకే వైరస్?
ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోన్న యూకే వైరస్ తొలి కేసు రాష్ట్రంలో నమోదైనట్లు తెలుస్తోంది. యూకే నుంచి ఈ నెల 10న రాష్ట్రానికి వచ్చిన 49 ఏళ్ల వ్యక్తిలో.. కొత్తగా మార్పు చెందిన కరోనా వైరస్ ఉన్నట్లు తాజాగా సీసీఎంబీ నిర్ధారించినట్లు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు తెలుస్తోంది. అలాగే యూకే వైరస్ ప్రవేశంపై దేశంలో ఎక్కడా ఇప్పటిదాకా అధికారిక ప్రకటనలేమీ లేవు. వివిధ రాష్ట్రాల్లో ఈ తరహాలో పరీక్షలు
వరంగల్ నగర జిల్లాకు చెందిన 49 ఏళ్ల వ్యక్తిలో గుర్తింపు!
బాధితుని తల్లికి కొవిడ్ పాజిటివ్
ఆమె నమూనాలూ సీసీఎంబీకి తరలింపు
నిలకడగానే ఇరువురి ఆరోగ్యం
అప్రమత్తమైన ఆరోగ్యశాఖ
ఈనాడు- హైదరాబాద్: ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోన్న యూకే వైరస్ తొలి కేసు రాష్ట్రంలో నమోదైనట్లు తెలుస్తోంది. యూకే నుంచి ఈ నెల 10న రాష్ట్రానికి వచ్చిన 49 ఏళ్ల వ్యక్తిలో.. కొత్తగా మార్పు చెందిన కరోనా వైరస్ ఉన్నట్లు తాజాగా సీసీఎంబీ నిర్ధారించినట్లు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు తెలుస్తోంది. అలాగే యూకే వైరస్ ప్రవేశంపై దేశంలో ఎక్కడా ఇప్పటిదాకా అధికారిక ప్రకటనలేమీ లేవు. వివిధ రాష్ట్రాల్లో ఈ తరహాలో పరీక్షలు కొనసాగుతుండడంతో.. వాటన్నింటి ఫలితాలను సమీకరించి ఒకేసారి కేంద్ర ఆరోగ్యశాఖే వెల్లడించే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వరంగల్ నగర జిల్లాకు చెందిన వ్యక్తిలో కొత్త రూపు సంతరించుకున్న కొవిడ్ సోకినట్లు తెలుస్తోంది. ‘‘ఈ వ్యక్తిలో 16న కొవిడ్ లక్షణాలు కనిపించగా, స్థానికంగానే పరీక్షలు చేయించారు. 22న వెల్లడైన ఫలితాల్లో కరోనా పాజిటివ్గా తేలింది. అప్పటి నుంచి వరంగల్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల కిందట సేకరించిన నమూనాలను సీసీఎంబీకి పంపించారు. కరోనా జన్యు పరిణామ క్రమ విశ్లేషణ పరీక్షల్లో వైరస్లో గణనీయమైన మార్పు చోటుచేసుకున్నట్లుగా గుర్తించారు. యూకేలో మార్పు చెందిన వైరసూ.. ఇదీ ఒక్కటేనని నిర్ధారించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారమిచ్చారు. బాధితుడి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు యుద్ధప్రాతిపదికన పరీక్షలు నిర్వహించారు. బాధితుడి భార్య సహా ఇతరులకూ కొవిడ్ నెగెటివ్ రాగా, తల్లి(71)కి మాత్రం పాజిటివ్గా తేలింది. ఆమెను కూడా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆమె నుంచి నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం సీసీఎంబీకి పంపించారు.
యూకే వైరస్ సోకిన వ్యక్తిలో, ఆయన తల్లిలో ఎటువంటి తీవ్ర అనారోగ్య సమస్యలూ లేవు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. మరో 7-10 రోజుల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచుతాం. ఇంకో రెండుసార్లు నిర్ధారణ పరీక్షలు చేయించి, యూకే వైరస్ నెగెటివ్గా తేలిన అనంతరమే.. ఆసుపత్రి నుంచి ఇంటికి పంపిస్తాం’’ అని వైద్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
రెండు సార్లు నెగెటివ్ వస్తేనే...
తాజా నిబంధనల ప్రకారం.. యూకే వైరస్ పాజిటివ్గా తేలిన వారిలో చికిత్స అనంతరం పరీక్షల్లో రెండుసార్లు నెగెటివ్ వస్తేనే.. పూర్తిస్థాయిలో ఆ వైరస్ ముప్పు తొలగిపోయినట్లుగా నిర్ధారిస్తారు. ప్రస్తుతానికి వరంగల్ కేసుకు సంబంధించి కుమారుడిలో మాత్రమే యూకే వైరస్ ఉన్నట్లుగా గుర్తించడంతో.. ఈ విధానం ఆయనకు మాత్రమే వర్తిస్తుంది. తల్లికి సాధారణ కొవిడ్ నిబంధనలే వర్తిస్తాయి. ఆ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలిగిన ఇతరులకూ మరోసారి కొవిడ్ పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ 2 వారాల పాటు ఇళ్ల వద్ద ఐసొలేషన్లో ఉండాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులు కోరారు.
నియంత్రణకు కార్యాచరణ
మార్పు చెందిన కరోనా వైరస్ను నియంత్రించేందుకు రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తొలిదశలోనే అడ్డుకోవడానికి యుద్ధప్రాతిపదికన కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ శాఖ కార్యదర్శి రిజ్వీ సోమవారం ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు.
అతి వేగంగా వ్యాప్తి చెందే ముప్పు
కరోనా వైరస్ ఇప్పటికే పలుసార్లు మార్పులు చెందగా.. సెప్టెంబరులో ఈ వైరస్లో చోటుచేసుకున్న గణనీయమైన పరివర్తనాలు ప్రమాదకరంగా మారినట్లుగా బ్రిటన్ గుర్తించింది. శరీరంలో వృద్ధి చెందిన యాంటీబాడీస్ నుంచి కూడా ఇది తప్పించుకుంటుందని పరిశోధకులు కనుగొన్నారు. యూకేలో తొలిసారి వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఇటలీ, డెన్మార్క్, నెదర్లాండ్స్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లోనూ విస్తరించడంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి.ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ కంటే.. ఈ జన్యు మార్పు చెందిన వైరస్ అతి వేగంగా వ్యాప్తి చెందే స్వభావాన్ని కలిగి ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు.‘ప్రస్తుతమున్న కరోనా వైరస్ వ్యాప్తి 30 శాతం ఉంటే.. ఈ కొత్త రకం వైరస్ వ్యాప్తి 40-70 శాతం ఉన్నట్లు తేలింద’ని పేర్కొన్నారు.
ముందస్తు జాగ్రత్తలే ముఖ్యం
-ఆచార్య డాక్టర్ జీకే పరంజ్యోతి, శ్వాసకోశ వ్యాధుల విభాగం అధిపతి, నిమ్స్
కరోనా ఆర్ఎన్ఏ వైరస్. ఇది ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటుంది. కొత్తగా యూకేలో పరివర్తనం చెందిన వైరస్కు.. ప్రస్తుతమున్న కరోనా వైరస్ కంటే అతి వేగంగా వ్యాప్తి చెందే గుణముంది. దీనివల్ల కేసుల సంఖ్య పెరుగుతుందేమోగానీ.. మరణాల శాతం పెరిగే అవకాశాల్లేవని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ప్రయోగ దశల్లో ఉన్న టీకాలు కూడా ఈ పరివర్తనం చెందిన వైరస్ను సమర్థంగా ఎదుర్కోగలవని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. మాస్కు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, గుంపుల్లో తిరగకపోవడం, మనిషికి మనిషికి మధ్య 6 అడుగుల ఎడం పాటించడం వంటి జాగ్రత్తలు యూకే వైరస్ను కూడా దీటుగా ఎదుర్కోవడానికి బాగా అక్కరకొస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్