TET Exam: డీఈడీ, బీఈడీ ఫైనల్ విద్యార్థులూ టెట్ రాయొచ్చు
డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులు కూడా ఈసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్-టెట్)కు హాజరుకావొచ్చు.
33 జిల్లాల్లో పరీక్షా కేంద్రాల ఏర్పాటు
పెరిగిన పరీక్ష ఫీజు
జూన్ 27న ఫలితాల విడుదల
నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ
ఈనాడు, హైదరాబాద్: డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులు కూడా ఈసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్-టెట్)కు హాజరుకావొచ్చు. ఈ మేరకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమకూ అవకాశం ఇవ్వాలని, కరోనా పరిస్థితుల్లో విద్యా సంవత్సరం ఆలస్యం కారణంగా తమ చదువు పూర్తికాలేదని అధికారులు, మంత్రులకు విన్నవించారు.ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసిన సమాచార పత్రం( ఇన్ఫర్మేషన్ బ్రోచర్)లో చివరి ఏడాది వారు కూడా హాజరుకావొచ్చని పేర్కొంది. దీనివల్ల సుమారు 25 వేల మందికి ప్రయోజనం కలుగుతుందని అంచనా. అందులో డీఈడీ విద్యార్థులు 3 వేల మంది వరకు ఉన్నారు. కాకపోతే తర్వాత టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్టు(టీఆర్టీ)నాటికి బీఈడీ/డీఈడీ/పండిట్ ట్రైనింగ్ పూర్తయి ఉండాలి. గతంలో టెట్లో అర్హత సాధించిన వారూ టెట్-2022కు హాజరై స్కోర్ పెంచుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. బీఈడీ అభ్యర్థులకు కూడా ఈసారి పేపర్-1 రాసుకునే అవకాశం ఇచ్చినందున దానికి అధిక సంఖ్యలో హాజరుకావొచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 2017టెట్లో పేపర్-1కు 88 వేల మందికిపైగా హాజరు కాగా... ఈసారి ఆ సంఖ్య రెండు లక్షలు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పరీక్ష ఫీజు రూ.100 పెంపు
రాష్ట్రంలో 2017 జులై 23న జరిగిన టెట్కు ఒక పేపర్ లేదా రెండింటికి కలిపి రూ.200 పరీక్ష ఫీజు ఉండగా ఈసారి దాన్ని రూ.300కు పెంచారు. ఏప్రిల్ 12 వరకు దరఖాస్తుకు అవకాశం ఉన్నా ఫీజు చెల్లింపు గడువు మాత్రం 11వ తేదీ వరకే ఉంటుంది.
జూన్ 6 నుంచి హాల్టికెట్లు
* 33 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఒక పరీక్ష కేంద్ర సామర్థ్యం పూర్తయిన వెంటనే ఆ కేంద్రం పేరు వెబ్సైట్లో కనిపించదు. అప్పుడు అభ్యర్థులు మిగిలిన సెంటర్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి.
* జూన్ 6 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 12న పరీక్ష జరిగితే అదే నెల 27న ఫలితాలు విడుదల చేస్తారు.
* టెట్ ఆఫ్లైన్ విధానంలో జరుగుతుంది. బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు(మల్టిపుల్ ఛాయిస్) ఉంటాయి. ప్రశ్నపత్రం రెండు భాషల్లో ఉంటుంది. అంటే ఆంగ్లంతో పాటు అభ్యర్థులు ఎంచుకున్న తెలుగు/ఉర్దూ/హిందీ/ బెంగాలీ/కన్నడ/మరాఠీ/తమిళ్/గుజరాతీ భాషల్లో ఉంటుంది.
* ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తూ వారి నియామకాన్ని కాంపిటెంట్ అథారిటీ ఆమోదం తెలపకుంటే వారూ టెట్ రాసుకోవచ్చు.
సందేహాలు తీర్చేందుకు హెల్ప్లైన్
దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించే ముందు, తర్వాత ఏమైనా సందేహాలుంటే మార్చి 26 నుంచి జూన్ 12 వరకు పనిదినాల్లో ఫోన్ చేయవచ్చు. అందుకు ఎస్సీఈఆర్టీలోని టీఎస్-టెట్ సెల్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.
* టెట్ కార్యాలయం: 8341371079, 8341831080
* సాంకేతిక సమస్యలకు( సీజీజీ కార్యాలయంలో): 040 23120340, 040 23120433
* టెట్, ఇతర సందేహాలకు: 8121010310, 8121010410
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం