త్వరలోనే గ్రూపు-4 ప్రకటన: హరీశ్‌రావు

త్వరలోనే గ్రూపు-4 ప్రకటన రానుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 317 జీవోపై కనీస అవగాహన లేని కాంగ్రెస్‌, భాజపా, ఇతర రాజకీయ నాయకులు దానిని రద్దు చేయాలంటున్నాయని ఆక్షేపించారు. ఆ జీవో కారణంగా 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు

Published : 07 Jul 2022 06:07 IST

సిద్దిపేట, న్యూస్‌టుడే: త్వరలోనే గ్రూపు-4 ప్రకటన రానుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 317 జీవోపై కనీస అవగాహన లేని కాంగ్రెస్‌, భాజపా, ఇతర రాజకీయ నాయకులు దానిని రద్దు చేయాలంటున్నాయని ఆక్షేపించారు. ఆ జీవో కారణంగా 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు దక్కనున్నాయని తెలిపారు. ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడంలేదో కేంద్రం వెల్లడించాలని, ఏ రంగానికి మేలు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సిద్దిపేటలో మంత్రి ఆధ్వర్యంలో కేసీఆర్‌ టెట్‌ ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించగా.. 618 మంది శిక్షణ పొందారు. వీరిలో 517 మంది (84 శాతం) మేర ఉత్తీర్ణత సాధించారు. ప్రతిభ కనబర్చిన పలువురు శిక్షణార్థులు, నిర్వాహకులను బుధవారం సత్కరించారు. నిరుద్యోగుల కోరిక మేరకు త్వరలోనే టీఆర్టీ సహా అన్నిరకాల ఉద్యోగాలకు సిద్దిపేటలో శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని