సీఎంకు ఐకాస కృతజ్ఞతలు

మేడ్చల్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. టీజీవో అధ్యక్షురాలు, ఐకాస

Published : 18 Aug 2022 05:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. టీజీవో అధ్యక్షురాలు, ఐకాస ప్రధాన కార్యదర్శి వి.మమత, ట్రెసా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌ తదితర నేతలు సీఎంను కలిశారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రతి చోటా సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని నిర్మించి, సువిశాల వాతావరణంలో అధికారులు, ఉద్యోగులు పనిచేసే అవకాశం కల్పించడం ద్వారా సమస్యల సత్వర పరిష్కారం జరుగుతోందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని