రాష్ట్రంలో క్లోవర్టెక్స్ రూ.100 కోట్ల పెట్టుబడులు
అమెరికాకు చెందిన ‘క్లోవర్టెక్స్’ సంస్థ తెలంగాణలో రూ.100 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. లైఫ్ సైన్సెస్ విభాగంలో సైంటిఫిక్ క్లౌడ్ కంప్యూటింగ్పై పనిచేస్తున్న క్లోవర్టెక్స్ అంతర్జాతీయ, పాన్-ఇండియా వినియోగదారులకు సేవలందించేందుకు హైదరాబాద్లోని తమ గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్(జీపీసీ)ను విస్తరించాలని నిర్ణయించింది.
హైదరాబాద్లోని జీపీసీ విస్తరణకు సుముఖం
అమెరికాలో మంత్రి కేటీఆర్తో సంస్థ ప్రతినిధుల భేటీ
ఈనాడు, హైదరాబాద్: అమెరికాకు చెందిన ‘క్లోవర్టెక్స్’ సంస్థ తెలంగాణలో రూ.100 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. లైఫ్ సైన్సెస్ విభాగంలో సైంటిఫిక్ క్లౌడ్ కంప్యూటింగ్పై పనిచేస్తున్న క్లోవర్టెక్స్ అంతర్జాతీయ, పాన్-ఇండియా వినియోగదారులకు సేవలందించేందుకు హైదరాబాద్లోని తమ గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్(జీపీసీ)ను విస్తరించాలని నిర్ణయించింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్తో బోస్టన్ నగరంలో సంస్థ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి క్షితిజ్ కుమార్ నేతృత్వంలోని మేనేజ్మెంట్ బృందం సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం.నాగప్పన్, సమ్మిట్ కన్సల్టింగ్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ సందీప్శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ‘‘క్లోవర్టెక్స్ హైదరాబాద్లోని జీపీసీని విస్తరించేందుకు రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించుకున్నందుకు సంతోషిస్తున్నా. దీనివల్ల 100-150 మందికి అదనంగా ఉద్యోగాలు లభిస్తాయి’’ అని తెలిపారు. 2019లో స్థాపించిన క్లోవర్టెక్స్ సంస్థ నూతన ఔషధాల పరిశోధనలపై దృష్టి పెడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఔషధం మార్కెట్లోకి రావడానికి సాధారణంగా పదేళ్లు పడుతోంది. ఔషధ ఆవిష్కరణ సమయాన్ని తగ్గించడం, రోగుల ప్రాణాలను రక్షించడంలో సహాయపడటం క్లోవర్టెక్స్ ప్రధాన లక్ష్యం. ‘‘తెలంగాణ ప్రభుత్వం అందించిన సహాయాన్ని మేము నిజంగా అభినందిస్తున్నాం. స్థానిక, అంతర్జాతీయ కంపెనీలకు కూడా ప్రపంచస్థాయి సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది’’ అని క్లోవర్టెక్స్ వ్యవస్థాపకుడు క్షితిజ్కుమార్ తెలిపారు.
స్టేట్ స్ట్రీట్ రాకతో 5 వేల ఉద్యోగాలు
హైదరాబాద్లోని బ్యాంకింగ్, ఆర్థిక, బీమా రంగాలకు గొప్ప ప్రోత్సాహం లభించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 40 ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులతో అతి పెద్ద మేనేజ్మెంట్ సంస్థల్లో ఒకటైన ‘స్టేట్ స్ట్రీట్’ సంస్థ హైదరాబాద్లో అయిదు వేల కొత్త ఉద్యోగాలను కల్పించడానికి తమ కార్యకలాపాలను విస్తరించనుందని ఆయన పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిస్ట్ తదితర సాంకేతిక నైపుణ్యాల్లో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు.
* గ్రిడ్ డైనమిక్స్ హోల్డింగ్స్ సంస్థ ప్రస్తుతం హైదరాబాద్లోని తమ సేవల సంస్థను మరింతగా విస్తరించనున్నట్లు ప్రకటించింది. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన సమావేశం అనంతరం గ్రిడ్ డైనమిక్స్ ఛైర్మన్ లాయిడ్ కార్నీ తమ నిర్ణయాన్ని వెల్లడించారు.
* క్లౌడ్, టెలీ కమ్యూనికేషన్స్, సెక్యూరిటీ, ఈఎస్జీ, డేటా సెంటర్ పరిశ్రమల్లో విస్తృతమైన నైపుణ్యమున్న పెట్టుబడి సంస్థగా పేరొందిన ఆరం ఈక్విటీ పార్టనర్స్ సంస్థ అంతర్జాతీయ విస్తరణకు 250 మిలియన్ డాలర్లను కేటాయించగా... ఇందులో 50 మిలియన్ డాలర్లను హైదరాబాద్లో డేటా సెంటర్ ఏర్పాటుకు ఖర్చు చేయడానికి సంసిద్ధత వ్యక్తంచేసింది.
* కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ స్టడీస్’తో తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. రవాణాలో పర్యావరణ కాలుష్యాన్ని నిరోధించడానికి అందుబాటులో అవకాశాలపై సంస్థ పరిశోధనలు చేస్తుంది.
కాళేశ్వరం నుంచి ప్రపంచం పాఠాలు నేర్చుకోవచ్చు
కాళేశ్వరం ప్రాజెక్టుకు అవార్డు అందించిన ‘అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్’ సంస్థ ప్రెసిడెంట్ మరియా సి.లెమన్, ఇతర ప్రతినిధులు ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించారు. నెవెడాలో సోమవారం ప్రారంభమైన ప్రపంచ పర్యావరణ, జలవనరుల సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన తర్వాత మంత్రి కేటీఆర్తో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించినప్పటి తమ అనుభవాలను పంచుకున్నారు. లెమన్ మాట్లాడుతూ... కాళేశ్వరం లాంటి వినూత్నమైన, అద్భుత ప్రాజెక్టులను ప్రపంచానికి పరిచయం చేయడం తమ ఉద్దేశమన్నారు. ఆ ప్రాజెక్టు నుంచి ప్రపంచ దేశాలు వినూత్న పాఠాలు నేర్చుకోవచ్చని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు