రామయ్య హుండీ ఆదాయం రూ.1.31 కోట్లు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 35 రోజులకు రూ.1,31,84,181 నగదు రూపంలో సమకూరింది.

Published : 03 May 2024 05:10 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 35 రోజులకు రూ.1,31,84,181 నగదు రూపంలో సమకూరింది. యూఎస్‌ డాలర్లు 25, యూఏఈ దిర్హమ్స్‌ 55, సింగపూర్‌ డాలర్లు 2, ఇంగ్లండ్‌ పౌండ్లు 10, థాయ్‌ల్యాండ్‌ బాట్స్‌ 20, సౌదీ రియాల్స్‌ 17, వెండి 1.45 కిలోలు, బంగారం 230 గ్రాములు కానుకల రూపంలో వచ్చినట్లు ఈవో రమాదేవి చెప్పారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో స్వామివారి పేరిట జమ చేశారు. శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలిరావడంతో ఈ ఆదాయం వచ్చిందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని