కొరత అని వారు.. లేదని వీరు
పద్దెనిమిదేళ్లు పైబడిన వారికి కరోనా టీకా వేయడానికి ఉద్దేశించిన తేదీ (మే 1) దగ్గర పడినా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ విషయంలో వివాదం మాత్రం కొలిక్కిరావడం లేదు. ప్రస్తుతం ఉన్న అరకొర నిల్వలతో అందరికీ
45 ఏళ్లలోపు వారికి టీకాలపై తలోమాట
కేంద్ర-రాష్ట్రాల గణాంకాల మధ్య కుదరని పొంతన
దిల్లీ: పద్దెనిమిదేళ్లు పైబడిన వారికి కరోనా టీకా వేయడానికి ఉద్దేశించిన తేదీ (మే 1) దగ్గర పడినా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ విషయంలో వివాదం మాత్రం కొలిక్కిరావడం లేదు. ప్రస్తుతం ఉన్న అరకొర నిల్వలతో అందరికీ టీకాలు వేయడం తమ వల్ల కాదని ఒక్కో రాష్ట్రం చేతులెత్తేస్తున్నాయి. కేంద్రం మాత్రం.. రాష్ట్రాల వద్ద ఇంకా కోటి డోసులు అందుబాటులో ఉన్నాయని చెబుతోంది. శనివారం నుంచి 18-45 ఏళ్లలోపు వారిని కూడా అర్హులుగా తీసుకోనున్నందువల్ల దేశంలో దాదాపు 50-60 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్కు అర్హులవుతారు. వీరికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమానికి మే ఒకటినే శ్రీకారం చుట్టే పరిస్థితి లేదని పలు రాష్ట్రాలు స్పష్టంచేస్తున్నాయి.
మా వల్ల కాదు..
వ్యాక్సిన్లను వయోజనులందరికీ ఇచ్చే పరిస్థితి తమవద్ద లేదని పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్సింగ్ సిద్ధూ తెలిపారు. కనీసం 10 లక్షల అదనపు డోసులు వస్తే తప్ప కార్యక్రమం ప్రారంభించలేమన్నారు. ఔషధ కంపెనీల నుంచి తగిన సంఖ్యలో వ్యాక్సిన్లు వస్తేనే 18-45 ఏళ్ల వారికి కరోనా టీకాలు వేసే అవకాశం ఉంటుందని గుజరాత్ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 45 ఏళ్ల లోపువారికి టీకాలు వేసేటంత నిల్వలు తమ వద్ద లేవని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తేల్చిచెప్పేశారు. కనీసం మూడు కోట్ల డోసులు పంపించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం.. కేంద్రాన్ని కోరింది. కేంద్రం నుంచి టీకా నిల్వలు రానందున మూడు రోజుల పాటు వ్యాక్సిన్ల కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ముంబయి అధికారులు ప్రకటించారు. కరోనా ఉచిత వ్యాక్సిన్ల కోసం తన ఏడాది వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేయనున్నట్లు మహారాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బాలాసాహెబ్ థోరాట్ ప్రకటించారు.
15 కోట్ల మార్కు దాటిన డోసులు
దేశంలో వినియోగించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 15 కోట్లు దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. మొత్తం 15,21,05,563 డోసులు గురువారం రాత్రి వరకు తీసుకున్నారని తెలిపింది.
ఉచితంగానే వేయాలి: రాహుల్
వ్యాక్సిన్ను దేశంలో అర్హులందరికీ ఉచితంగానే వేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ డిమాండ్ చేశారు. ‘ఫ్రీ’ అనే మాటకు నిఘంటువులో ఉన్న అర్థాలు జతచేస్తూ ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!