Published : 31/05/2021 00:17 IST

ఆరోగ్యానికి అరటి దువ్వలు!

అరటిచెట్టు కాండం మధ్యలో లేతగా ఉండే దువ్వ చాలా మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ఇందులోని పీచు, పొటాషియం, విటమిన్ల వంటివి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు.
జీర్ణశక్తికి..: అరటి దువ్వ శరీరంలోని టాక్సిన్స్‌ను బయటికి పంపుతుంది. దీన్లోని పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. చిన్న పిల్లలు, గర్భిణుల్లో జీర్ణాశయ సమస్యలను దూరం చేస్తుంది. ఎసిడిటీని దరిచేరనివ్వదు.
మూత్రాశయానికి.. : శరీరానికి తగినంత నీటిని అందించనప్పుడు మూత్రాశయంలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే అరటిదువ్వతో చేసిన కప్పు రసానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి తాగితే మంచిది. మూత్రాశయంలో రాళ్ల సమస్య రాకుండా, యూరినరీ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా కాపాడుతుంది.
అధికబరువు : పీచు అధికంగా ఉండే దీన్ని కనీసం వారానికి రెండు మూడు సార్లన్నా తీసుకుంటే చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. జీవక్రియలను సక్రమంగా జరిగేలా చేస్తుంది. అతితక్కువ కెలొరీలతో ఉండే అరటి దువ్వ అధిక బరువుకు దూరంగా ఉంచుతుంది.
కొలెస్ట్రాల్‌, రక్తపోటును : దువ్వలో విటమిన్‌ బీ6, అధికశాతంలో ఉండే ఐరన్‌ రక్తంలోని హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతాయి. ఇందులో ఉండే పొటాషియం అధిక కొలెస్ట్రాల్‌, రక్తపోటును నియంత్రిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి