UN: ‘ఆకలితో అలమటిస్తున్నారు.. సంతానాన్ని అమ్ముకుంటున్నారు.. ఆదుకోండి’
అఫ్గానిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశ ప్రజల పరిస్థితులు దయనీయంగా మారిపోయాయి. తినేందుకు తిండి దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు.......
అఫ్గాన్లోని దుర్భర పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన
జెనీవా: అఫ్గానిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశ ప్రజల పరిస్థితులు దయనీయంగా మారిపోయాయి. తినేందుకు తిండి దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. ఈ దుర్భర పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్పీ) మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఆకలి చావుల నుంచి తప్పించుకునేందుకు తమ శరీర భాగాలతోపాటు పిల్లలను విక్రయిస్తున్నట్లు వాపోయింది. దేశంలోని సగానికి పైగా జనం ఆకలితో అల్లాడుతున్నారని.. మానవతా దృక్పథంతో అఫ్గాన్ ప్రజలకు సాయమందించాలని డబ్ల్యూఎఫ్పీ చీఫ్ డేవిడ్ బేస్లీ ప్రపంచ దేశాలకు మరోసారి విజ్ఞప్తి చేశారు.
జర్మనీకి చెందిన జాతీయ మీడియాతో డేవిడ్ బేస్లీ మాట్లాడుతూ ‘అఫ్గానిస్థాన్ గత 20 ఏళ్లుగా తాలిబన్లతో పోరాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం భారీ విపత్తును ఎదుర్కొంటోంది. దేశంలోని 40 మిలియన్ల (4 కోట్లు) మందిలో 23 మిలియన్ల (2.3 కోట్లు) మంది ఆకలితో అలమటిస్తున్నారు’ అని పేర్కొన్నారు. తన కుమార్తెను పోషిస్తారనే ఆశతో.. నిస్సహాయ స్థితిలో ఆమెను వేరే కుటుంబానికి విక్రయించినట్లు ఓ అఫ్గాన్ మహిళ తనతో చెప్పారని బేస్లీ వెల్లడించారు.
కరోనా మహమ్మారి, కరువు కారణంగా ఆఫ్గానిస్థాన్ ఆర్థికంగా క్షీణించిపోయింది. దాదాపు 24 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ముగిసేసరికి దేశ జనాభాలోని 97 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన పడిపోవచ్చని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పలు దేశాలు ఆర్థిక సాయంతోపాటు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నప్పటికీ.. వారి సాయం ఏమాత్రం సరిపోవడం లేదు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రజలు.. చిన్నారులను కాపాడుకొనేందుకు తమ జీవితాలను పణంగా పెడుతున్నారు. శరీర భాగాలను విక్రయిస్తున్నారు. హెరాత్ ప్రావిన్స్లో కొన్ని నెలలుగా కిడ్నీల విక్రయాలు పెరిగిపోయాయి. చాలామంది కిడ్నీలు అమ్మేందుకు ముందుకొస్తున్నారని అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు.‘నేను బయటకు వెళ్లి డబ్బులు అడుక్కోలేను. అందుకే ఆసుపత్రికి వెళ్లి నా కిడ్నీని లక్షా 69 వేలకు అమ్మేశా. ఆ డబ్బుతో కనీసం నా పిల్లలకు కొంతకాలమైనా తిండి పెడతాను’ అని గులాం హజ్రత్ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం స్థానిక మీడియాతో మాట్లాడాడు. అఫ్గాన్లో చాలామంది తండ్రులు ఇదేతరహా వ్యథలో ఉన్నట్లు వాపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
చైనా యుద్ధ విమానాలు మరోసారి ఆస్ట్రేలియాను బెదిరించే ప్రయత్నం చేశాయి. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం ముదిరింది. -
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
క్రెమ్లిన్లో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. -
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
చైనాలోని ఓ ఆసుపత్రిలో దుండగుడు కత్తులతో జరిపిన దాడిలో పలువురు చనిపోయారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. -
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
Rafah crossing: రఫాపై దాడి కొనసాగిస్తున్న ఇజ్రాయెల్.. ఇక్కడి సరిహద్దు క్రాసింగ్ను తన ఆధీనంలోకి తీసుకుంది. -
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
India-Maldives: భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాన్ని సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. -
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా వేగానికి చెక్ రిపబ్లిక్ కోర్టు బ్రేకులు వేసింది. -
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
Sunita Williams: సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. -
నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. -
అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. -
ట్రంప్నకు వెయ్యి డాలర్ల జరిమానా
హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. -
రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ
రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్ లాంబ్సడార్ఫ్ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తివంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు