Mount Everest: నడవలేని స్థితి నుంచి ఎవరెస్ట్ శిఖరంపై నిలిచి.. అంతలోనే ప్రాణాలు విడిచి..!
ఎవరెస్ట్ శిఖరాన్ని (Mount Everest) అధిరోహించాలన్న తన కలను నిజం చేసుకున్న ఓ ఆస్ట్రేలియన్ వ్యక్తి.. శిఖరం నుంచి కిందకు దిగి దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్ డెస్క్: పదిహేడళ్ల క్రితం ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని చూసి మళ్లీ నడవడం కష్టమే అని తేల్చేశారు వైద్యులు. కానీ, అతడు కుంగిపోలేదు. ఆత్మస్థైర్యంతో కోలుకుని తిరిగి నడవడమే గాక.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం (Mount Everest)పైకి ఎక్కి తన కల నెరవేర్చుకున్నాడు. అయితే, అదే అతడి చివరి ప్రయాణమవుతుందని అనుకోలేదు. ఎవరెస్ట్ శిఖరం నుంచి కిందకు దిగుతూ దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు.
ఆస్ట్రేలియా (Australia)లోని పెర్త్కు చెందిన 40 ఏళ్ల జేసన్ బెర్నార్డ్ కెన్నిసన్ (Jason Bernard Kennison) గత శుక్రవారం 8,849 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని (Mount Everest) అధిరోహించాడు. అక్కడి నుంచి కిందకు దిగే క్రమంలోనే జేసన్ ఆరోగ్యపరంగా ఇబ్బందులకు గురయ్యాడు. అది గమనించిన ఇద్దరు షెర్పా గైడ్లు ఆయనను 8,400 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బాల్కనీ ప్రాంతానికి తీసుకొచ్చారు. అయితే వారితో పాటు తెచ్చుకున్న ఆక్సిజన్ సిలిండర్లు నిండుకున్నాయి. దీంతో జేసన్ను క్యాంప్ 4 ప్రాంతానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అప్పుడైతే వారు తిరిగి ఆక్సిజన్ సిలిండర్లను తెచ్చుకుని ఆయనను రక్షించొచ్చని ఆశించారు.
అయితే, దురదృష్టవశాత్తూ బలమైన గాలుల కారణంగా జేసన్ను తీసుకుని క్యాంప్ 4కు చేరుకోలేకపోయారు. దీంతో ఆయన అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయినట్లు షెర్పా గైడ్లు మీడియాకు వెల్లడించారు. ఎవరెస్ట్ (Mount Everest) పర్వతంపై 8000 మీటర్ల పైనున్న ప్రాంతాన్ని డెత్జోన్గా పేర్కొంటారు. అక్కడే జేసన్ మరణించారు. ఇప్పటికీ ఆయన మృతదేహం శిఖరంపైనే ఉందని గైడ్లు తెలిపారు. 17 క్రితం 2006లో జేసన్ ఆఫీసుకు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను చూసి మళ్లీ నడిచే అవకాశాలు లేవని వైద్యులు చెప్పారట. స్పైనల్ కార్డ్ దెబ్బతినడంతో చాలా నెలల పాటు జేసన్ మంచానికే పరిమితమయ్యారు. అయితే తిరిగి కోలుకోవడమే గాక.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.
నేపాల్ (Nepal) టూరిస్ట్ విభాగం గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది 450 మంది పర్వతారోహకులు ఎవరెస్టు శిఖరం ఎక్కారు. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మంది ఎవరెస్ట్ పర్వతంపై ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం