Boris Johnson: ఇంటి నుంచి పనిచేస్తుంటే.. కాఫీ కారణంగా దృష్టి మరలుతుంది..!
కరోనా వైరస్ రాకతో.. వర్క్ ఫ్రమ్ హోం విధానం సర్వసాధారణమైంది. సంస్థలు హైబ్రిడ్ పని సంస్కృతిని అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో ఉద్యోగుల్ని కార్యాలయాలకు రప్పించాలని యాజమాన్యాలు యోచిస్తున్నాయి.
లండన్: కరోనా వైరస్ రాకతో.. వర్క్ ఫ్రమ్ హోం విధానం సర్వసాధారణమైంది. సంస్థలు హైబ్రీడ్ పని సంస్కృతిని అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో ఉద్యోగుల్ని కార్యాలయాలకు రప్పించాలని యాజమాన్యాలు యోచిస్తున్నాయి. అందుకు తగ్గట్టగా ఆదేశాలు ఇస్తున్నాయి. కానీ ఉద్యోగుల ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది. ప్రస్తుత పరిస్థితులపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
‘ఇంటి నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగుల దృష్టి మరలుతుంది. ఈ విధానంతో నాకెదురైన అనుభవం చెప్తున్నా. పనిచేసేప్పుడు మధ్యలో ఇంకో కాఫీ తెచ్చుకునేందుకు మనం ఎక్కువ సమయం వెచ్చిస్తాం. తర్వాత మళ్లీ తినుబండారాలు తెచ్చుకోవడానికి నడచుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్తాం. తిరిగి నిదానంగా నడుచుకుంటూ ల్యాప్టాప్ వద్దకు వస్తాం. కూర్చున్నాక.. మనం చేస్తోన్న పనేంటో కూడా గుర్తుండదు. అందుకే మళ్లీ కార్యాలయాలకు రావాల్సిన అవసరం ఉంది. చాలామందికి నా మాటలు నచ్చకపోవచ్చు. చుట్టూ ఇతరులుంటే మన నుంచి ఉత్పాదకత ఎక్కువ వస్తుంది. మరింత ఉత్సాహం, కొత్త కొత్త ఐడియాలతో పనిచేస్తామని నా నమ్మకం’ అంటూ జాన్సన్ అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే..ట్విటర్ మాత్రం ఎప్పటికీ ఇంటి నుంచే పనిచేసేలా ఉద్యోగులకు అవకాశం ఇచ్చింది. అయితే, ఇప్పుడు ఆ సంస్థ యాజమాన్యం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు ఆ విధానం అలాగే ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఇదిలా ఉంటే.. తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయడంపై ఉద్యోగులు సుముఖంగా లేరని కథనాలు వస్తున్నాయి. యాపిల్ సంస్థలో 76 శాతం వారంలో మూడు రోజులు రావడానికి కూడా ఇష్టపడటం లేదని ఓ సర్వే వెల్లడించింది. తాజాగా ఇదే విషయమై కోడింగ్ నైపుణ్యాలు నేర్పించే వైట్ హ్యాట్ సంస్థలో 800 మంది రాజీనామా చేశారని ఓ నివేదిక పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం