Corona: కరోనా.. ఇన్ఫ్లుయెంజా కంటే 3 రెట్లు ప్రాణాంతకం..!
ఇన్ఫ్లుయెంజాతో బాధపడుతున్న వారితో పోలిస్తే కరోనా వైరస్ వల్ల ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకున్న వారిలోనే దుష్ర్పభావాలు, మరణం ముప్పు అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది
స్పెయిన్ పరిశోధకుల అధ్యయనం
లండన్: ఇన్ఫ్లుయెంజాతో బాధపడుతున్న వారితో పోలిస్తే కరోనా వైరస్ వల్ల ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకున్న వారిలోనే దుష్ర్పభావాలు, మరణాల ముప్పు అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అయితే, చిన్న వయసులో ఉన్నవారికి మాత్రం ఇటువంటి ప్రమాదం తక్కువేనని పేర్కొంది. స్పెయిన్ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయన వివరాలు.. ఏప్రిల్ 23-26 తేదీల్లో పోర్చుగల్లో జరిగే సదస్సులో వెల్లడించనున్నారు.
కరోనా వైరస్ వెలుగుచూసిన తర్వాత దీర్ఘకాలంలో వాటి ప్రభావాలపై అంతర్జాతీయంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా 2017-2019 మధ్యకాలంలో సీజనల్ ఇన్ఫ్లుయెంజాతో ఆస్పత్రిలో చేరిన 187 మంది బాధితులను (సరాసరి వయసు 76) పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేపట్టారు. మరోవైపు 2020 మార్చి, మే నెలలో కొవిడ్ బారినపడిన 187 మంది బాధితుల రికార్డులను తీసుకొని ఇన్ఫ్లుయెంజా బాధితుల సమాచారంతో పోల్చి చూశారు. వాటిలో కొవిడ్ బాధితులందరికీ ఆక్సిజన్ చికిత్స అవసరం అయినట్లు గుర్తించారు. ఇన్ఫ్లుయెంజా బాధితులు ఎక్కువగా మునుపటి అనారోగ్య కారణాలతోనే బాధపడుతుండగా.. కొవిడ్ బాధితుల్లో మాత్రం ఆస్పత్రి చేరికలు అధికంగా ఉన్నాయని కనుగొన్నారు.
ఇలా రెండు వైరస్ల బాధితుల ఆరోగ్య సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని విశ్లేషించిన పరిశోధకులు.. ఇన్ఫ్లుయెంజా కంటే కొవిడ్ ప్రాణాంతకమైనదనే విషయాన్ని గుర్తించారు. అంతేకాకుండా కొవిడ్ బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చు కూడా అధికంగా ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన నిపుణులు పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ప్రాణాలతో బయటపడినప్పటికీ కొందరిలో కొవిడ్ దుష్ర్పభావాలు కొంతకాలంపాటు వెంటాడుతున్నాయని చెప్పారు. అయితే, పూర్తి మోతాదుతోపాటు బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ రెండు వైరస్లను ఎదుర్కోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి