Dawood Ibrahim : కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం.. విష ప్రయోగం అనుమానాలు?
దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో కరాచీలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. అతడిపై విషప్రయోగం జరిగినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కరాచీ: పరారీలో ఉన్న అండర్వరల్డ్ డాన్, ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) తీవ్ర అనారోగ్యంతో కరాచీ (Karachi)లోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. అతడిపై విషప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. భారీ భద్రత నడుమ అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రెండు రోజుల క్రితమే అతడిని ఆస్పత్రిలో చేర్చారట.
మీడియా కథనాల ప్రకారం.. కరాచీలోని ఓ ఆస్పత్రిలో ఫ్లోర్ మొత్తం ఖాళీ చేసి కేవలం దావూద్ ఒక్కడినే ఉంచి చికిత్స అందిస్తున్నారు. కేవలం వైద్యులు, కుటుంబ సభ్యులను మాత్రమే ఆ అంతస్తుకు అనుమతిస్తున్నారు. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. వీటిపై దావూద్ సమీప బంధువుల నుంచి సమాచారం సేకరించేందుకు ముంబయి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
బైడెన్ కాన్వాయ్ను ఢీకొన్న కారు.. అమెరికాలో కలకలం
మరోవైపు, పాకిస్థాన్ (Pakistan)లో ఆదివారం రాత్రి నుంచే ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వెబ్సైట్లు కూడా డౌన్ అయినట్లు సమాచారం. ముఖ్యంగా కరాచీ, లాహోర్, రావల్పిండి వంటి ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లు పాక్లోని కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి.
1993లో ముంబయిలో జరిగిన భీకర పేలుళ్ల తర్వాత దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్కు పారిపోయాడు. అయితే, అతడు తమ దేశంలోనే ఉన్నట్లు పాక్ ఇంతవరకూ అంగీకరించలేదు. కానీ, దావూద్ కరాచీలోనే ఉన్నాడని అతడి సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్ చెప్పినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ ఏడాది జనవరిలో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పేర్కొంది. అంతేగాక, దావూద్ ముఠా కరాచీ ఎయిర్పోర్టును నియంత్రిస్తున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. దావూద్ రెండో పెళ్లి కూడా చేసుకున్నట్లు సదరు ఛార్జ్షీట్లో పేర్కొంది. ఇప్పటికే దావూద్ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. 2018లో ఐరాస విడుదల చేసిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదుల జాబితాలో దావూద్ పేరు కరాచీ అడ్రసుతో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై విభిన్న ప్రచారాలు జరుగుతున్నాయి. అంతరిక్ష లేజర్లు.. వారసత్వ పోరు కారణంగానే ఆయన ప్రాణాలు కోల్పోయారని వీటిల్లో పేర్కొంటున్నారు. -
ఎట్టిపరిస్థితుల్లోనూ భారత భద్రతకు ముప్పును అనుమతించబోం: శ్రీలంక
Sri Lanka: బాధ్యతాయుత పొరుగుదేశంగా భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను అనుమతించబోమని శ్రీలంక స్పష్టం చేసింది. గత ఏడాది చైనా గూఢచార నౌక ఒకటి శ్రీలంక తీరంలో ఆగడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
‘రక్తంతో తడిసిన రైసీ చేతులు’.. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అమెరికా
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా సంతాపం వ్యక్తం చేసింది. అయితే, ఈ సందర్భంగా ఆయనపై ఉన్న ఆరోపణలను గుర్తుచేసింది. -
అదే డేంజర్ బెల్!
ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగున్నర దశాబ్దాల నాటి హెలికాప్టర్. మరమ్మతులు, నిర్వహణకు సరైన విడిభాగాలు లేవు. ఇదేదో సరకు రవాణాకు ఉపయోగించే లోహవిహంగం కాదు.. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పయనిస్తున్న హెలికాప్టర్. -
మతబోధకుడి స్థాయి నుంచి అధ్యక్ష పీఠం వరకు
ఇబ్రహీం రైసీ.. ప్రస్తుత ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకే కాదు.. అంతకుముందు అధినేతగా ఉన్న ఖొమైనీకీ సన్నిహితుడే. ఈ ఇద్దరి అధినేతల అండతోనే మతబోధకుడిగా ప్రస్థానం ప్రారంభించిన రైసీ అధ్యక్ష స్థానం వరకు ఎదిగారు. రైసీ సంస్కరణ వాది కాదు.. కరడుగట్టిన సంప్రదాయ వాది. -
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ ఇవ్వండి
ఇజ్రాయెల్-హమాస్ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా హమాస్, ఇజ్రాయెల్ నేతలకు అరెస్టు వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ఐసీసీ) ప్రధాన ప్రాసిక్యూటర్ సోమవారం కీలక అభ్యర్థనలు చేశారు. -
శ్రీలంక ఆలయంలో సరయు నదీ జలాలతో కుంభాభిషేకం
శ్రీలంకలోని సీతా అమ్మన్ ఆలయానికి ఆదివారం నిర్వహించిన కుంభాభిషేకం కార్యక్రమంలో శ్రీలంక, భారత్, నేపాల్కు చెందిన వేల మంది భక్తులు పాల్గొన్నట్లు భారత హైకమిషన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. -
అసాంజేకు భారీ ఊరట
గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు సోమవారం లండన్ న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. -
‘కలుషిత రక్తం’ కుంభకోణంపై రిషి సునాక్ క్షమాపణలు
బ్రిటన్లో 1970ల్లో చోటుచేసుకున్న కలుషిత రక్తం కుంభకోణాన్ని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) కప్పిపుచ్చినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రధానమంత్రి రిషి సునాక్ సోమవారం క్షమాపణలు తెలిపారు. -
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్సులోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. తక్షణం రంగంలోకి దిగిన ‘ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ’ ఘటన జరిగిన ప్రాంతాన్ని సోమవారం ఉదయం గుర్తించింది. -
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసినా.. అనేక మందితో లైంగిక కార్యకలాపాలు కొనసాగించిన ఓ సెక్స్ వర్కర్ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు
-
‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. తమ ఎంపీకి భాజపా షోకాజ్ నోటీసులు
-
‘ఫ్యామిలీస్టార్’కు నెగెటివ్ టాక్ ఇలా క్రియేట్ చేశారు: ఆనంద్ దేవరకొండ
-
నోరుజారి ఇరకాటంలో పడి.. ఉపవాసానికి సిద్ధమై: వివాదం వేళ భాజపా నేత పోస్టు
-
అట్టహాసంగా నియామక పత్రాలిచ్చారు.. 4 నెలలుగా జీతాలివ్వలేదు: హరీశ్రావు
-
అప్పుడు సెలక్టర్ కాళ్లు పట్టుకోలేదని.. జట్టులోకి ఎంపిక చేయలేదు: గంభీర్