USA: అమెరికా ఖలిస్థానీలను హెచ్చరించిన ఎఫ్బీఐ..!
ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య అనంతరం అమెరికాలో (USA)ని ఖలిస్థానీ మద్దతుదార్లను ఎఫ్బీఐ అధికారులు స్వయంగా ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని ఓ ఆంగ్లపత్రిక వెల్లడించింది.
ఇంటర్నెట్డెస్క్: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో కెనడాలోని ఖలిస్థానీలను అమెరికా(USA)లోని ఎఫ్బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) స్వయంగా అప్రమత్తం చేసింది. ఏ క్షణమైన మృత్యువు ముంచుకొస్తుందని వారిని హెచ్చరించినట్లు ఇన్వెస్టిగేటివ్ పత్రిక ఇంటర్సెప్ట్ ఈ మేరకు కథనం ప్రచురించింది. ఈ ఏడాది జూన్లో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేత నిజ్జర్ను కెనడాలోని సర్రేలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఈ ఘటన అనంతరం తనతో సహా కాలిఫోర్నియాలోని ఇద్దరు సిక్కు నేతలకు ఎఫ్బీఐ నుంచి ఫోన్లు వచ్చాయని అమెరికన్ సిక్కు కాకసస్ కమిటీ సమన్వయ కర్త ప్రీత్పాల్ ఇంటర్సెప్ట్కు వెల్లడించారు. కొందరి వద్దకు అధికారులు నేరుగా వెళ్లి కలిసినట్లు సమాచారం.
‘‘జూన్ చివర్లో నా వద్దకు ఇద్దరు ఎఫ్బీఐ స్పెషల్ ఏజెంట్లు వచ్చారు. నా ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు వారికి సమాచారం అందిందని వెల్లడించారు. ముప్పు ఏ రూపంలో వస్తుందనేది వారు చెప్పలేదు. నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పారు’’ అని ప్రీత్పాల్ వెల్లడించారు.
మరోవైపు నిజ్జర్ హత్యకు ముందే తమకు ప్రాణహాని ఉందని కెనడాలోని ఇంటెలిజెన్స్ బృందాలు హెచ్చరించినట్లు బ్రిటిష్ కొలంబియా గురుద్వారా కౌన్సిల్ ప్రతినిధి మహిందర్ సింగ్ వెల్లడించారు. అదే సమయంలో ఆ బృందాలు నిజ్జర్ను కూడా హెచ్చరించినట్లు వెల్లడించారు. మరోవైపు నిజ్జర్ను భారత్ 2020లోనే ఉగ్రవాదిగా పేర్కొంటూ.. అతడిపై రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా కెనడా ప్రభుత్వం అతడి భద్రతపై అధిక దృష్టిపెట్టడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
మూడోసారి అంతరిక్షయానానికి సిద్ధమయ్యారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams). ఈ సందర్భంగా ఆమె తన ఇష్టాలను వెల్లడించారు. -
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
Israel Hamas Conflict: ఇజ్రాయెల్పై వస్తున్న విమర్శలను ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. తమని ఏ దేశమూ నిలువరించలేదని వ్యాఖ్యానించారు. -
టెక్సాస్ను ముంచెత్తుతున్న వరదలు
భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
బ్రెజిల్లో వరద బీభత్సం.. 60 మంది మృతి
బ్రెజిల్లోని రియో గ్రాండ్ డొ సుల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తడంతో నగరంలో 60 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. -
శ్వేతసౌధం ప్రహరీ గేటును ఢీకొన్న కారు: డ్రైవర్ దుర్మరణం
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం ప్రహరీ గేటును కారు ఢీకొట్టిందని, ఈ ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
కీలక క్రాసింగ్పై హమాస్ దాడి
గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్ షాలోమ్ క్రాసింగ్పై ఆదివారం హమాస్ రాకెట్లతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. -
మాదక ద్రవ్యాలు ఇచ్చి నాపై లైంగిక దాడి చేశారు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఎంపీ బ్రిటానీ లాగా(37)కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళ సరదాగా గడపడానికి వెళ్లిన ఆమెకు కొంతమంది దుండగులు మాదకద్రవ్యాలు అందించారు. -
చట్టబద్ధ పాలన ఉన్న దేశం మాది
కెనడా.. చట్టబద్ధ పాలన ఉన్న దేశమని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో శనివారం పేర్కొన్నారు. తమ దేశంలో బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని, పౌరులను రక్షించడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. -
అల్-జజీరాపై నిషేధం
హమాస్కు అనుకూలంగా.. పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్పై ఆదివారం ఇజ్రాయెల్ నిషేధం విధించింది. -
హమాస్తో తాజా చర్చలు విఫలం?
ఇజ్రాయెల్తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు ముగిశాయని హమాస్ ఆదివారం ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా