USA: అమెరికా ఖలిస్థానీలను హెచ్చరించిన ఎఫ్బీఐ..!
ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య అనంతరం అమెరికాలో (USA)ని ఖలిస్థానీ మద్దతుదార్లను ఎఫ్బీఐ అధికారులు స్వయంగా ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని ఓ ఆంగ్లపత్రిక వెల్లడించింది.
ఇంటర్నెట్డెస్క్: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో కెనడాలోని ఖలిస్థానీలను అమెరికా(USA)లోని ఎఫ్బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) స్వయంగా అప్రమత్తం చేసింది. ఏ క్షణమైన మృత్యువు ముంచుకొస్తుందని వారిని హెచ్చరించినట్లు ఇన్వెస్టిగేటివ్ పత్రిక ఇంటర్సెప్ట్ ఈ మేరకు కథనం ప్రచురించింది. ఈ ఏడాది జూన్లో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేత నిజ్జర్ను కెనడాలోని సర్రేలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఈ ఘటన అనంతరం తనతో సహా కాలిఫోర్నియాలోని ఇద్దరు సిక్కు నేతలకు ఎఫ్బీఐ నుంచి ఫోన్లు వచ్చాయని అమెరికన్ సిక్కు కాకసస్ కమిటీ సమన్వయ కర్త ప్రీత్పాల్ ఇంటర్సెప్ట్కు వెల్లడించారు. కొందరి వద్దకు అధికారులు నేరుగా వెళ్లి కలిసినట్లు సమాచారం.
‘‘జూన్ చివర్లో నా వద్దకు ఇద్దరు ఎఫ్బీఐ స్పెషల్ ఏజెంట్లు వచ్చారు. నా ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు వారికి సమాచారం అందిందని వెల్లడించారు. ముప్పు ఏ రూపంలో వస్తుందనేది వారు చెప్పలేదు. నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పారు’’ అని ప్రీత్పాల్ వెల్లడించారు.
మరోవైపు నిజ్జర్ హత్యకు ముందే తమకు ప్రాణహాని ఉందని కెనడాలోని ఇంటెలిజెన్స్ బృందాలు హెచ్చరించినట్లు బ్రిటిష్ కొలంబియా గురుద్వారా కౌన్సిల్ ప్రతినిధి మహిందర్ సింగ్ వెల్లడించారు. అదే సమయంలో ఆ బృందాలు నిజ్జర్ను కూడా హెచ్చరించినట్లు వెల్లడించారు. మరోవైపు నిజ్జర్ను భారత్ 2020లోనే ఉగ్రవాదిగా పేర్కొంటూ.. అతడిపై రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా కెనడా ప్రభుత్వం అతడి భద్రతపై అధిక దృష్టిపెట్టడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Iraq: ఇరాక్లో బాంబు దాడి.. 10 మంది మృతి
ఇరాక్లోని దియాలా ప్రావిన్స్లో స్థానిక ఎంపీ బంధువులపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందగా.. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
రామస్వామి అభ్యర్థిత్వానికి ఎదురుదెబ్బలు
అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలో దిగేందుకు రిపబ్లికన్ పార్టీ నామినేషను కోసం పోటీపడుతున్న భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి (38)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
భూతాపంలో 2023 కొత్త రికార్డు
వాతావరణ రికార్డుల్లో 2023 అత్యుష్ణ సంవత్సరంగా నిలిచిపోనుందని ఐక్యరాజ్య సమితికి అనుబంధమైన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) గురువారం తెలిపింది. -
చర్చల ప్రసక్తే లేదన్న ఉత్తర కొరియా
తాము ఇటీవల నిర్వహించిన గూఢచారి ఉపగ్రహ ప్రయోగాన్ని అమెరికా ఖండించడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడి సోదరి కిమ్ యో జాంగ్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు సింగపూర్, జ్యూరిచ్
ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్ నిలిచాయని ‘ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ (ఈఐయూ) తెలిపింది. -
97కు చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణను గురువారం ఉదయం మరో రోజుకు పొడిగించారు. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగియాల్సి ఉంది. -
అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ మృతి
ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్(100) బుధవారం కనెక్టికట్లోని తన స్వగృహంలో కన్నుమూశారు. -
మొదటి నుంచీ అదే చెబుతున్నాం
సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర పన్నిన భారతీయుడిపై అమెరికా అభియోగాలను మోపడంద్వారా మేం చెబుతున్న వాదనలకు బలం చేకూరిందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యాఖ్యానించారు. -
తూర్పు ఉక్రెయిన్పై రష్యా దాడులు
తూర్పు ఉక్రెయిన్లోని దొనెట్స్క్ ప్రాంతంపై గురువారం రష్యా ఎస్-300 క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో పలు నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. -
ఓస్ప్రేల నిలిపివేత!
అమెరికా వైమానిక దళానికి చెందిన ఓస్ప్రే విమానం సాగర జలాల్లో కూలిపోయిన నేపథ్యంలో జపాన్ పునరాలోచనలో పడింది. తన వద్ద ఉన్న ఇదే తరహా విమానాల కార్యకలాపాలను కొంతకాలం పాటు నిలిపివేయాలని భావిస్తోంది. -
‘మరింత అణుశక్తి కావాలి’
వాతావరణ మార్పులపై పోరాటానికి మరింత అణుశక్తి కావాల్సి ఉందని, పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు ఇది ఎంతో ముఖ్యమని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ మారియానా గ్రాసీ పేర్కొన్నారు.