ChatGPT - Google: గూగులమ్మకు కొత్త గుబులు!
గూగుల్... ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది! ప్రపంచంలో ఏ మూలనైనా సెర్చ్ ఇంజిన్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్, మ్యాప్స్లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైపోయింది.
సవాలు విసురుతున్న ‘చాట్జీపీటీ’
కృత్రిమ మేధతో సరికొత్త ఆవిష్కరణ
గూగుల్... ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది! ప్రపంచంలో ఏ మూలనైనా సెర్చ్ ఇంజిన్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్, మ్యాప్స్లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైపోయింది. ఏ సందేహం వచ్చినా గూగులమ్మను అడగటం పరిపాటైంది. అలాంటి గూగులమ్మ ఇప్పుడు అప్రమత్తం కావల్సిన దశ వచ్చింది! తన అస్థిత్వానికి ముప్పు వాటిల్లుతుందా అని గూగుల్ ఆందోళన చెందుతోంది. కారణం- సాంకేతిక ప్రపంచంలో వచ్చిన సరికొత్త ఆవిష్కరణ- చాట్జీపీటీ!
చాట్జీపీటీ... కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో తయారైన చాట్బాట్ గూగుల్కు సవాల్ విసురుతోంది. ఇంకా సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి రాకుండా, ప్రయోగ దశలోనే రెండు వారాల్లో 10లక్షల మంది యూజర్లను దాటిన ఈ చాట్జీపీటీని చూసి గూగుల్ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి తలెత్తింది. రెండేళ్లలో ఇది గూగుల్ను దాటి పోతుందని అనుకుంటున్నారు.
ఏంటీ చాట్జీపీటీ
శాన్ఫ్రాన్సిస్కోలోని ఓపెన్ఏఐ అనే సంస్థ కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన సాఫ్ట్వేరే ఈ చాట్జీపీటీ. 2015లో శామ్ ఆల్ట్మన్, ఎలాన్ మస్క్ కలసి 100 కోట్ల డాలర్లతో ఈ కంపెనీని ఆరంభించారు. 2018లో మస్క్ రాజీనామా చేశారు. అయినా పెట్టుబడులు మాత్రం పెడుతున్నారు. 2019లో మైక్రోసాఫ్ట్ కూడా ఇందులో 100 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.
అందుబాటులో ఉందా?
ప్రస్తుతానికి ఇదింకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. ఉచితంగా అందుబాటులోనే ఉంది. ఓపెన్ఏఐ.కామ్ వెబ్సైట్లోకి వెళ్లి నమోదు చేసుకొని దీన్ని వినియోగించి చూడవచ్చు. వాడుతున్నవారి నుంచి సూచనలు తీసుకొని తీర్చిదిద్దుతున్నారు. లోపాలు లేకుండా పూర్తిస్థాయిలో ప్రజలందరికీ అందుబాటులో రావటానికి సమయం పడుతుంది.
ఏంటి దీని ప్రత్యేకత?
ఇంటర్నెట్లోని కోట్ల పదాల శిక్షణతో రూపొందిన ఏఐ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ జీపీటీ-3ని (జెనెరేటివ్ ప్రి ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్-3) ఓపెన్ఏఐ ప్రకటించింది. ప్రస్తుతానికి 175 బిలియన్ రకాల పారామితులతో కూడిన అత్యంత భారీ, శక్తిమంతమైన ఏఐ లాంగ్వేజ్ ప్రాసెసింగ్గా దీన్ని భావిస్తున్నారు. 300 బిలియన్ పదాలను దీని వ్యవస్థలో అమర్చారు.
మనుషుల మాదిరిగా రాతరూపంలో ఆవిష్కరించటమేగాకుండా, అనువాదాల్లో కూడా ఇది ఎంతో కచ్చితంగా ఉంటుంది. గూగుల్ సెర్చి మాదిరిగా ప్రశ్నలకు సమాధానాలను లిస్ట్ చేయటంతో ఆగకుండా... సులభంగా అర్థమయ్యేలా సమాధానాలను రాతరూపంలో రాస్తుంది. చాట్జీపీటీ. అంతేగాకుండా ఏవైనా అంశంపై కొత్త వ్యాసం కావాలన్నా, పరిశోధన పత్రాలు కావాలన్నా రాసిస్తుంది. అంతెందుకు టాపిక్ చెబితే కొత్త కవిత, లేఖలు కూడా తక్షణమే రాసిస్తుంది. మనుషులు మాట్లాడే వివిధ భాషలను అర్థం చేసుకొని సమాధానం ఇవ్వగలుగుతుంది. మనుషులు మాట్లాడుకున్నట్లే పిచ్చాపాటీ కబుర్లు చెబుతుంది. జోక్లు పేలుస్తుంది. వినియోగదారుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే చాట్బోట్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి పరిధి చాలా పరిమితం. ఈ చాట్జీపీటీ మాత్రం వేగంగా, ఎదురుగా మనిషి కూర్చొని సమాధానం ఇచ్చినట్లే ఏది అడిగినా చెబుతుంది.
గూగుల్ ఎందుకు భయపడుతోంది?
గూగుల్లో ఏదైనా అడిగితే దానికి సంబంధించిన లింక్ల జాబితా వరుసగా వస్తుంది. కానీ అదే చాట్జీపీటీని అడిగితే... లింక్లు ఇచ్చి విడిచిపెట్టకుండా... ఆ అంశాన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్లు వివరంగా అర్థం చేయిస్తుంది. అందుకే ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గూగుల్ ఇంజిన్పై ఆధారపడటం తగ్గుతుందన్నది ఆందోళన. ‘‘గూగుల్ పని అయిపోయినట్లే! బహుశా మరో ఏడాదో రెండేళ్లలోనో కృత్రిమ మేధ గూగుల్ను విచలితం చేయబోతోంది. ఎల్లో పేజెస్ను గూగుల్ ఎలా దెబ్బతీసిందో... చాట్జీపీటీ గూగుల్కు అదే పని చేయబోతోంది’’అని జీమెయిల్ డెవలపర్ పౌల్ బుచెట్ హెచ్చరించటం గమనార్హం. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన గూగుల్.. చాట్జీపీటీకి దీటైన సాఫ్ట్వేర్ను రూపొందించే పనిలో పడింది. కేవలం సంభాషణలకే పరిమితం కాకుండా, చాట్జీపీటీకి మించి, బొమ్మలతో కూడిన సమాధానాలు ఇచ్చేలా కొత్త సాఫ్ట్వేర్తో రావాలని తమ కృత్రిమ మేధ బృందాలను సీఈవో సుందర్పిచాయ్ పురమాయించారని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం